Telugu News

ఖమ్మం నగరం రాష్ట్రానికే ఆదర్శం..మంత్రి పువ్వాడ.*

▪️75 ఏళ్లలో జరగని అభివృధ్ధి ఎడేళ్ళలో జరిగింది.

0

ఖమ్మం నగరం రాష్ట్రానికే ఆదర్శం..మంత్రి పువ్వాడ.*

*▪️75 ఏళ్లలో జరగని అభివృధ్ధి ఎడేళ్ళలో జరిగింది.*

*▪️నాడు కనీస సౌకర్యాలు కరువు.. ఖమ్మం నేడు కార్పొరేషన్లుకు రోల్ మోడల్.*

*▪️కేసీఅర్, కేటీఆర్ గారి సహకారంతోనే ఇంతటి అభివృద్ధి సాధ్యం అయింది.*

*▪️ఐదు డివిజన్ లలో రూ.10.23 కోట్లతో నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంక్ లు ప్రారంభం.*

*▪️త్రీ టౌన్ ప్రజల దాహుర్తిని తీర్చే 23 లక్షల సామర్ధ్యం గల టాంక్ బహుబలి..*

*▪️రాష్ట్ర అవతరణ ఉత్సవాల్లో భాగంగా పట్టణ ప్రగతి దినోత్సవం కార్యక్రమంలో 5 ఓవర్ హెడ్ ట్యాంక్స్(ELSR’s) ప్రారంభించిన మంత్రి పువ్వాడ.*

(ఖమ్మంప్రతినిధి-విజయం న్యూస్)

ఖమ్మం నగరంలో ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధి యావత్‌ రాష్ర్టానికే ఆదర్శంగా నిలుస్తుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు.

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు పురస్కరించుకుని పట్టణ ప్రగతి దినోత్సవం సందర్భంగా ఖమ్మం నగరంలో త్రాగునీటి శాశ్వత పరిష్కారం లో భాగంగా రూ.10.23 కోట్లతో నిర్మించిన 5 డివిజన్లలో నూతనంగా నిర్మించిన ఓవర్ హెడ్ ట్యాంక్ లను మంత్రి పువ్వాడ ప్రారంభించారు.

ఇది కూడా చదవండి:- గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట: మంత్రి

ఖమ్మం కార్పోరేషన్ పరిధిలోని 20వ డివిజన్ రామ చంద్రయ్య నగర్ లో రూ.1.80 కోట్లతో నిర్మించిన 10 లక్షల లీటర్ల సామర్ధ్యం గల ట్యాంక్, 23వ డివిజన్ SP ఆఫీస్ రోడ్ లో రూ.1.65 కోట్లతో నిర్మించిన 9లక్షల సామర్ధ్యం గల ట్యాంక్, 32వ డివిజన్ గుట్టల బజార్ లో రూ.3.48 కోట్లతో నిర్మించిన 23 లక్షల లీటర్ల సామర్ధ్యం గల(బహుబలి) ట్యాంక్, 53వ డివిజన్ NSP క్యాంపులోని రూ.1.80 కోట్లతో నిర్మించిన 10లక్షల లీటర్ల సామర్ధ్యం గల ట్యాంక్, 43వ డివిజన్ ZP సెంటర్ లో రూ.1.50కోట్లతో నిర్మించిన 8లక్షల లీటర్ల సామర్ధ్యం గల ట్యాంక్ లను మంత్రి పువ్వాడ ప్రారంభించారు.

ఇది కూడా చదవండి:- దివ్యాంగుల పెన్షన్ పెంపు పట్ల మంత్రి పువ్వాడ హర్షం..*

*ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..* గడిచిన ఎనిమిదేళ్లలో రాష్ట్రప్రభుత్వం ఖమ్మం అభివృద్ధికి కోట్లాది రూపాయలు విడుదల చేసిందన్నారు. 75 ఏళ్లలో జరగని అభివృద్ధి కేవలం ఏడేళ్లలోనే సాధ్యమైందన్నారు.

ఖమ్మం ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన నాడు ఖమ్మం నగరం అత్యంత దారుణమైన దుస్థితిలో సరైన రోడ్లు లేక, త్రాగునీరు రాక.. ట్యాంకర్ల ద్వారా త్రాగునీరు, ఇరుకైన దారులు, రోడ్ల మీద చెత్త చెదారంతో దుర్గంధభరితంగా ఉండేదన్నారు.

ఇది కూడా చదవండి:- దేశానికే తెలంగాణ ఆదర్శం:- మంత్రి పువ్వాడ

ముఖ్యంగా ఖమ్మం త్రీ టౌన్ లో త్రాగునీటికి తీవ్ర ఎద్దడి ఉండేదని దానిని నేడు శాశ్వతంగా పరిష్కరించగలిగామని గుట్టల బజార్ లో రూ.3.48 కోట్లతో నిర్మించిన 23 లక్షల లీటర్ల సామర్ధ్యం గల బహుబలి ట్యాంక్ తో మొత్తం గృహాలను నల్లా కనెక్షన్లు ఇచ్చి త్రాగునీరు అందిస్తున్నామని అన్నారు.

సొంత ఇంటిని శుభ్రం చేసుకున్న మాదిరిగా ఒక్కొక్కటిగా సమస్యలను అధిగమిస్తు, అభివృద్ధి చేసుకుంటూ నేడు ఖమ్మం రాష్ట్రానికే ఆదర్శంగా నిలువటం గర్వంగా ఉందన్నారు. నేడు రాష్ట్రంలో ఖమ్మం ఒక రోల్ మోడల్ గా నిలిపామని పేర్కొన్నారు.

ఖమ్మం అభివృద్ధిలో భాగస్వాములు అయి తనవంతు కర్తవ్యంగా ఖమ్మంను టైర్ సిటీస్ వరుసలో నిలుపలని దృఢంగా సంకల్పించుకున్నానని అది నేడు ఆచరణలో చేసి చూపించగలిగామని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి:-  తెలంగాణలో బీఆర్ఎస్ ఖేల్ ఖతమ్:బండి సంజయ్ 

ముఖ్యమంత్రి కేసీఅర్ గారు నేతృత్వంలో, పురపాలక మంత్రి కేటిఆర్ గారి సహకారంతో నేడు ఖమ్మం రాష్ట్రంలోని అన్ని కార్పొరేషన్లుకు ఆదర్శంగా నిలువడం మనకు గర్వకారమన్నారు. ఖమ్మం నగరంలో ఒకప్పుడు వాటర్‌ ట్యాంకులు గల గల అంటూ తిరుగుతానే ఉండేవి.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదన్నారు.

ఖమ్మం నగరం చిన్న చిన్న రోడ్లతో ట్రాఫిక్‌ సమస్యలతో ఉండేది.. ఇపుడు ఎక్కడ అయిన ఏ రోడ్లు చూసినా విశాలంగా ఉన్నాయి. రోడ్లు విస్తరించాం, ఖమ్మంలో సరైన స్మశాన వాటిక ఒక్కటి కూడా ఉండేది కాదు. కానీ ఇప్పుడు బల్లెపల్లి, కాల్వఒడ్డు వైకుంఠధామంల ముందు ప్రజలు సెల్ఫీలు తీసుకుంటున్నారని గుర్తు చేశారు.

ఖమ్మం ప్రజలకు, చిన్న పిల్లలకు ఆహ్లాదం కోసం ప్రతి డివిజన్లలో పార్కులు, అందులో ఓపెన్‌ జిమ్‌లు, పబ్లిక్‌ టాయిలెట్స్‌, తాగునీరు ఇలా అనేక వసతులు అందుబాటులోకి తీసుకొచ్చామని, తెలంగాణ ప్రభుత్వం ఖమ్మం ప్రజా అవసరాల కోసం, అభివృద్ధి కోసం దాదాపు 2వేల కోట్ల రూపాయల నిధులు ఇచ్చిందన్నారు.

ఇది కూడా చదవండి:- నిరుపేదల అభ్యున్నతే సీఎం కేసీఆర్ లక్ష్యం:మంత్రి పువ్వాడ 

నగరంలో అన్ని ప్రాంతాల్లో పార్కులు, ఓపెన్ జిమ్ లు, పబ్లిక్ టాయిలెట్స్, వెజ్ అండ్ నాన్-వెజ్ మార్కెట్ లు, అన్ని ప్రాంతాలలో రైతు బజార్ లు, వాక్ వే లు, సెంట్రల్ లైటింగ్ లు, వైకుంఠదామాలు, తెలంగాణ క్రీడా ప్రాంగణాలు, ఫుట్ పాత్ లు, మిషన్ భగీరథ ద్వారా త్రాగు నీరుకొసం నూతన ఓవర్ హెడ్ టాంక్ లు, అన్ని జంక్షన్ లలో కూడళ్లు, ఇలా అనేక అభివృద్ధి పనులు చేసుకుని ప్రజలకు మెరుగైన వసతులు, సౌకర్యాలు అందిస్తున్నామని అన్నారు.

నగరపాలక సంస్థ పరిధిలో ఎక్కడైనా చిన్న సమస్యలు తలెత్తినా తక్షణమే స్పందించి పరిష్కరించుకుంటున్నమని వివరించారు.

అనంతరం అవతరణ ఉత్సవాల వేడుకల్లో భాగంగా SR &BGNR మైదానం నుండి నూతన మున్సిపల్ కార్యాలయం వరకు మున్సిపల్ సిబ్బంది చే భారీ సంఖ్యలో చేపట్టిన వాహనాలతో ర్యాలీ ప్రదర్శనను మంత్రి పువ్వాడ జెండా ఊపి ప్రారంభించి పాల్గొన్నారు.

కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, జిల్లా కలెక్టర్ VP గౌతమ్, పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్.వారియర్, మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, కార్పొరేటర్ లు కర్నాటి కృష్ణ, బిక్కసాని ప్రశాంత లక్ష్మి, BG క్లెమెంట్, మక్బూల్, దొన్వాన్ సరస్వతి, పగడాల శ్రీవిద్య, సుడా చైర్మన్ విజయ్, పబ్లిక్ హెల్త్ EE రంజిత్, DE రంగారావు, నాయకులు ఉన్నారు.