ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయమూర్తి కలిసిన మద్ది
బాధ్యతలు చేపట్టిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన అడ్వికేట్
ఖమ్మం జిల్లా ప్రధాన న్యాయమూర్తి కలిసిన మద్ది
== బాధ్యతలు చేపట్టిన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన అడ్వికేట్
(ఖమ్మం-విజయంన్యూస్)
ఖమ్మం జిల్లా కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి గా నూతన బాధ్యతలు స్వీకరించిన బి. ఎస్ జగ్ జీవన్ కుమార్ ని, ప్రముఖ న్యాయవాది, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ మద్ది శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం కోర్టు లో, మర్యాదపూర్వకముగా కలిసి, పుష్ప గుచ్ఛం అందజేశారు. న్యాయమూర్తి నల్గొండ జిల్లా కోర్ట్ నుంచి బదిలీ పై వచ్చి, ఖమ్మం జిల్లా కోర్ట్ లో బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కోర్టులో పనిచేసే లాయర్లందరు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కాగా మద్ది శ్రీనివాస్ రెడ్డితో పాటు కొంత మంది న్యాయవాదులు జడ్జిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమములో సీనియర్ న్యాయవాదులు వంజాకు లక్ష్మి నారాయణరావు, ఉబ్బన రామ కృష్ణ, మామిడి హనుమంత రావు, దూళిపాల నాగేశ్వరావు, K యాకుబ్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు