కాళోజీ చిత్రపటానికి నివాళ్ళు అర్పించిన మంత్రి పువ్వాడ
తెలుగు రాష్ట్ర ప్రజలకు తెలుగు భాషా దినోత్సవ శుభాకాంక్షలు
కాళోజీ కి నివాళ్ళు అర్పించిన మంత్రి పువ్వాడ
©© తెలంగాణ భాషా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్
(ఖమ్మం విజయం న్యూస్)
ప్రజా కవి, పద్మ విభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ‘ఎవని భాషను వాడు రాయాలె, మాట్లాడాలె’ అనే కాళోజీ మాతృభాష స్ఫూర్తి తెలంగాణ సాంస్కృతిక ఉద్యమానికి దిక్సూచిగా నిలిచిందని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణ భాషా సాహిత్యానికి కాళోజీ అస్తిత్వ స్పృహను అందించారని, వారి స్ఫూర్తిని కొనసాగిస్తూ అమ్మ భాషకు సాహితీ గౌరవాన్ని మరింతగా పెంచేందుకు తెలంగాణ సాహితీ వేత్తలు కృషిని కొనసాగించాలని సూచించారు.
ఇది కూడా చదవండి:- వినాయక నిమజ్జనం ఎప్పుడు..?
తెలంగాణ భాషా సాహిత్య రంగాల్లో కృషి చేస్తున్న కవులు రచయితలను గుర్తించి వారికి కాళోజీ పేరున పురస్కారాలను అందిస్తూ సీఎం కేసిఆర్ సారథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం గౌరవించుకుంటున్నది గుర్తు చేశారు. ‘పుట్టుక నీది.. చావు నీది.. బతుకంతా దేశానిది’ అని నినదించిన కాళోజీ జీవితం అంతా తెలంగాణ భాషా సాహితీ సేవ దిశగా సాగిందన్నారు.
ఇది కూడా చదవండి:- ఖమ్మంకు వచ్చిన ‘ఇస్మాట్ శంకర్’