Telugu News

పార పట్టి.. రోడ్డు పై డామర్ వేసిన మంత్రి పువ్వాడ

నగరంలోని పలు డివిజన్లలో మంత్రి పర్యటన

0

పార పట్టి.. రోడ్డు పై డామర్ వేసిన మంత్రి పువ్వాడ

== మురుగు నీటిని తొలగించిన మంత్రి పువ్వాడ

== ఖమ్మం నగరం సుందరంగా మారాలి

== పట్టణ ప్రగతితో ప్రజల సమస్యలన్ని పోవాలి

== ప్రతి డివిజన్  అద్దంలా అభివద్ది జరగాలి

== అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలి

== రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

== నగరంలోని పలు డివిజన్లలో మంత్రి పర్యటన

== హాజరైన మేయర్, కమీషనర్, అధికారులు, ప్రజాప్రతినిధులు

ఖమ్మం ప్రతినిధి,జూన్ 6(విజయంన్యూస్):

ఖమ్మం నగరం సుందరంగా మారాలని, అందుకు గాను పట్టణ ప్రగతిలో నిర్దేశించిన ప్రతి ఒక్క పనిని పూర్తి చేయాలని  రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సూచించారు.  పట్టణ ప్రగతిలో భాగంగా జరుగుతున్న అభివృద్ధి పనుల పరిశీలన కార్మికులతో కలిసి మురుగు తొలగించిన రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. పట్టణ ప్రగతిలో నిర్దేశించిన ఏ ఒక్క పని కూడా వదలొద్దని, పూర్తి స్థాయిలో ఆయా పనులు పూర్తి చేయాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు అధికారులను అదేశించారు. పట్టణ ప్రగతిలో భాగంగా సోమవారం ఖమ్మం కార్పోరేషన్ పరిధిలో కొనసాగుతున్న పనులను స్వయంగా పరిశీలించారు. 36వ డివిజన్ పి.ఎస్.ఆర్. రోడ్ లో కాల్వలో మురుగు తొలగించే పనులను మంత్రి ప్రారంభించారు. గాంధీ చౌక్ సెంటర్ లో రోడ్డు మరమ్మత్తు పనులను పారతో స్వయంగా శుభ్రం చేశారు. 50వ డివిజన్ రాపర్తి నగర్ లో కచ్చా నాళను శుభ్రం చేసే పనులను ప్రారంభించారు. చెత్త చెదారం తొలగించి పూర్తి స్థాయిలో బాగు చేయాలన్నారు. 51, 52వ డివిజన్ ఎన్.ఎస్.పి క్యాంపులో ప్రభుత్వ భూములను శుభ్రం చేసి సంరక్షించాలని అన్నారు. చెత్త తొలగింపు పనులను మంత్రి ప్రారంభించారు. 16వ డివిజన్ లక్ష్మి గార్డెన్స్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన పట్టణ ప్రకృతి వనంను మంత్రి ప్రారంభించారు.

ఇది కూడా చదవోచ్చు : – ఘనంగా కూసుమంచి ఎంపీపీ పుట్టిన రోజు వేడుకలు

ఆయా పనుల్లో భాగంగా ప్రజల వద్దకు నేరుగా వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో చేపట్టాల్సిన పనులు, గత పట్టణ ప్రగతిలో చేపట్టిన పనుల పరిష్కారం, పురోగతిపై మున్సిపల్ అధికారులను ఆరా తీశారు. అభివృద్ధి పనులతో పాటు పారిశుద్ధ్య పనులు కూడా ప్రాథమిక బాధ్యతగా చేపట్టాలని ఆదేశించారు. ఈ సంధర్భంగా మంత్రి మాట్లడుతూ అభివృద్ధితో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు నేరుగా అందుతున్నాయని, వాటిని సకాలంలో అర్హులైన వారందరికీ అందేలా చూసే బాధ్యత అధికారులదేనని స్పష్టం చేశారు. పల్లె, పట్టణాల్లో ఎన్నో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె, పట్టణ ప్రగతిలో ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ తప్పక పాల్గొని తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. మనపరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని సీజనల్ వ్యాధుల భారిన పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పట్టణ ప్రాంతాల్లో పట్టణ ప్రకృతి వనంలు, నర్సరీల కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందని, కొన్ని డివిజన్లలో అనుకున్న పనులు బాగా జరుగుతుండగా, కొన్ని డివిజన్లలో జరగడం లేదని, అధికారులు అలసత్వం వీడాలన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ముందుచూపుతో రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరుస్తున్నారని అన్నారు. ఈ అనంతరం 14, 16, 36, 40, 41, 42, 45వ డివిజన్లోని నర్సరీ లను పరిశీలించారు. వచ్చే హారితహరం కార్యక్రమం కొరకు ప్రభుత్వ లక్ష్యానికి మించి మొక్కలు సిద్ధం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో నగర మేయర్ పూనుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కమార్, డి.సి.సి.బి చైర్మన్ కూరాకుల నాగభూషణం, ఎస్.ఇ ట్రాన్స్ కో ఏ.సురేందర్, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహర, మున్సిపల్ కమిషనర్ ఆదర్న్ సురభి, అసిస్టెంట్ కమిషనర్ మల్లీశ్వరి, పబ్లిక్ హెల్త్ ఇ.ఇ రంజిత్ కుమార్, వ్యవసాయ కమిటీ చైర్మన్ లక్ష్మి ప్రసన్న, కార్పొరేటర్లు పసుమర్తి రామ్ మోహన్, రాపర్తి శరత్, కమర్తపు మురళి, శీలంశెట్టి రమా వీరభద్రం, కూరాకుల వలరాజు, మక్బూల్, బుర్రి వెంకట్ కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు, తహశీల్దార్ శైలజ, మున్సిపల్, విద్యుత్, పబ్లిక్ హెల్త్ అధికారులు, సిబ్బంది తదితరులు ఉన్నారు.