ఖమ్మం రూరల్ కచ్చిరుముంగట మస్తు లొల్లి..
తుమ్మల మనిషి అరెస్ట్..అర్థరాత్రి స్టేషన్ ఎదుట తుమ్మల వర్గీయుల గొడవ
ఖమ్మం రూరల్ కచ్చిరుముంగట మస్తు లొల్లి..
** తుమ్మల మనుషి భాస్కర్ మిట్టచికట్ల అరెస్ట్
** కచ్చిరుతాన మస్తు లొల్లి చేసిన తుమ్మల మనుషులు
** పోలీసులకు, టీఆర్ఎస్ నేతలు తొపులాడుకున్నరు
** తుమ్మల మనుషుల అరెస్ట్
(ఖమ్మం రూరల్/ఖమ్మం-విజయం న్యూస్)
ఖమ్మం జిల్లా, ఖమ్మం రూరల్ కచ్చిరేదుట అర్థరాత్రి మస్తు లొల్లి అయ్యింది.. తుమ్మల మనుషులు కచ్చిరు ముంగట కుర్చున్నరు.. తుమ్మల మనిషిని పట్టుకొచ్చుడేందని ఘరమైండ్రూ.. వెంబటే వదిలేయాలని అరిచిండ్రూ.. గిదేందిరబై మా పని మమ్మల్న జేసుకొనియ్యరా అంటూ ఖమ్మం రూరల్ ఏసీపీ సారూ, సీఐ, ఎస్ఐ సార్లు తుమ్మల మనుషులపై మస్తు ఘరమైండ్రూ.. లోపలేయీండ్రంటూ కోపగించిండ్రూ.. తుమ్మల మనుషుల్లో జొన్నలగడ్డరవిని అరెస్టు జేసేందుకు ప్రయత్నంలో తుమ్మల మనుషులకు, పోలీసులకు మస్తు తోపులాటైంది. నెట్టుకున్నరు.. కిందపడ్డరు.. గిల్లా రవి కొంత నైరసపడ్డడూ.. అయినసొంది పోలీసులు వదలకుంటా కచ్చిర్లేసిండ్రూ..గిట్ల బెస్తారం మిట్టరాత్రిళ్ళ మస్తు లొల్లి అయ్యింది.. గదేందో అషలు ముచ్చట చూద్దం పారీ..
alldo read: “ఆ నలుగురు” చుట్టే రాజకీయం.. ఖమ్మం జిల్లాలో పొలిటికల్ హిట్
పాలేరు నియోజకవర్గంలో రెండు రోజుల కిందటనుంచి గులాబీ పార్టోళ్ళకు మస్తు లొల్లి జరుగుతుంది కదా.. మాజీమంత్రి తుమ్మల నాగేశ్వరరావు మనుషులు, ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి మనుషులు పొట్టుపొట్టు మాటలనుకుంటున్నరు.. మనందరికి తెలిసిందే కథేనే..గేముంది..ఇక ఖమ్మం రూరల్ లోపట తుమ్మల మనిషి జంగం భాస్కర్, కందాళ ఉపేందర్ రెడ్డి మనిషికి వాట్సఫ్ గూటిల మస్తు మాటలనుకున్ళరంటా..తుమ్మల మనిషి స్థానిక 59 వ డివిజన్ మాజీ కార్పొరేటర్ జంగం భాస్కర్ కి, ఖమ్మం రూరల్ సోషల్ మీడియా కార్యదర్శి మేకల ఉదయ్ కుమార్ కి జరిగిన ఫోన్ మాటలలో పొట్టుపొట్టు అనుకున్నరంటా..? గీ విషయంలో జంగం భాస్కర్ ని. పోలీసులు మిట్ట చికట్ల పట్టకొచ్చిండ్రూ పోలీసోళ్ళూ.. గీమాట ఆనోటగీనోట తుమ్మల మనుషులకు చేరింది.. ఇక ఊకుంటరా.. కూసుమంచి, నేలకొండపల్లి, తిరుమలాయపాలెం, ఖమ్మం రూరల్ నుంచి తుమ్మల మనుషులు జొన్నగల గడ్డ రవికుమార్, మాదాసు ఉపేందర్, బారీ వీరభద్రం, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రమేష్, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు సీతారాములు, మాజీ సర్పంచ్ బండి జగదీష్, తమ్మినేని కృష్ణయ్య, బారీ వీరభద్రం, మహిపాల్, జనార్దన్, ఆశోక్ తదితరలు ఖమ్మం రూరల్ కచ్చిరు కాడికి అచ్చి జంగం భాస్కర్ ఎందుకు పట్టుకొచ్చిండ్రో చెప్పమన్నరు. ఆయనేక్కడున్నడో చూపియన్నరు.. గయినప్పటికి పోలీసులు చెప్పకపోయేసరికి కచ్చిరు ముంగట కూకున్నరు. పెద్దగా నినాదాలు చేసిండ్రూ.. గీ విషయం ఖమ్మం రూరల్ ఏసీపీ సార్ కు తెలిసి మిట్టచికట్లనే ఖమ్మం రూరల్ కచ్చిరు కాడికొచ్చిండు..కచ్చిరూ ముంగటగేందీ మీ లొల్లి పొద్దుగళ్ళ రాపోరి అన్నడు్ అయిన తుమ్మల మనుషులు గినలే. అట్టనే.కుచ్చున్నరు.. గేమైంది పోలీసులకు మస్తు కోపమైంది.. ధర్నా చేస్తున్నదాంట్లో పెద్ద నాయకుడు జొన్నలగడ్డ రవిని పోలీసులు పట్టుకుని లోపలకు తీసుకబోతుండగా తుమ్మల మనుషులు అడ్డంపడ్డరు. పోలీసులకు, నాయకులకు మస్తు గలాట అయ్యింది.. తొపులాడుకున్నరు.. కిందపడ్డరు.. గీసుంట్ల జొన్నలగడ్డ రవికుమార్ కొంత సొయితప్పిండూ. కిందపడిపోయిండూ. అయినప్పటికి పోలీసులు లోపలేసిండ్రూ.. ఒక్కోక్కల్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు పంపించిండ్రూ..గయితే.. ఈ సమాచారం రాత్రే తుమ్మల మనుషులకు చెప్పుకున్నరు.. పొద్దుగళ్ళా ఏం జరుగుతదో చూడాలే మరీ..అరెస్టు సమాచారం పోలీసులు గోప్యంగా ఉంచారు.