క్షతగాత్రురాలిని ఆస్పత్రికి తరలించిన మాజీ ఎంపీ పొంగులేటి
(వైరా/ఖమ్మం-విజయంన్యూస్);-
ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడంలో తెరాస రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ముందుంటారనే విషయం ప్రతి ఒక్కరికి విధితమే. కాగా ఆదివారం ఉమ్మడి జిల్లా పర్యటనలో ఉన్న ఆయన వైరా నుంచి మధిర వైపుగా వెళ్తుండగా అదే సమయంలో ఓ రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గాయపడిన ఓ క్షతగాత్రురాలిని అక్కున చేర్చుకుని మనోధైర్యం కల్పించారు.
స్థానిక ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం ఖమ్మంలోని కిమ్స్ ఆసుపత్రికి తరలించి ఉచిత వైద్యం అందించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలని వైరా మున్సిపల్ ఛైర్మన్ సూతకాని జైపాల్ ద్వారా ఆయన అనుచరులు, సిబ్బందిని ఆ