కామారెడ్డి లో కారును ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు… ఐదుగురు మృతి..
—మాచారెడ్డి: కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఘన్పూర్(ఎం) గ్రామశివారులో
—ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
—ఈ ఘటనలో ఐదుగురు దుర్మరణం చెందగా ఓ చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి.
(కామారెడ్డి విజయం న్యూస్):-
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కామారెడ్డి వైపు నుంచి కరీంనగర్ వైపు వెళ్తున్న కారును ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. దీంతో కారు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు, బాలుడు అక్కడికక్కడే మృతి చెందగా ఓ చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి.
also read;-యాదాద్రి లో ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు.
ఆర్టీసీ బస్సు ముందు టైర్ పేలడంతోనే ఈ ప్రమాదం సంభవించినట్లు స్థానికులు చెబుతున్నారు. కారు నెంబర్ ఆధారంగా మృతులంతా నిజామాబాద్ జిల్లా కమ్మరిపల్లికి చెందినవారిగా భావిస్తున్నారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు సంఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. గాయపడిన చిన్నారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.