*కూసుమంచి ఎస్సై కారుకి ప్రమాదం*
** తప్పిన ప్రమాదం.. డ్రైవర్ కు గాయాలు
(కూసుమంచి-విజయం న్యూస్)
ఖమ్మం జిల్లా కూసుమంచి ఎస్సై సందీప్ కారు రాత్రి ప్రమాదానికి గురైంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బురాన్ పురం ప్రాంతంలోని జెండాల సెంటర్ వద్ద కారు వేగం అదుపు తప్పి డివైడర్ కు ఢీ కొట్టింది.
కారులో డ్రైవర్ తప్ప ఎవరులేరు. డ్రైవర్ తలకు గాయాలైనట్టు స్థానికులు తెలిపారు.
గాయాలైన డ్రైవర్ ను స్థానికుల సహాయంతో ఆసుపత్రికి తరలించారు.
జరిగిన ఘటనపై పోలీసులు వివరాలు ఆరా తీస్తున్నారు.
Also read :- ఉర్స్ ఉత్సవం లో తీవ్ర ఉద్రిక్తత.. ఇద్దరు మృతి