Telugu News

కలిసి పనిచేద్దాం..మళ్ళీ గెలుద్దాం: మంత్రి పువ్వాడ

బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనంలో శ్రేణులకు పిలుపునిచ్చిన మంత్రి పువ్వాడ.

0
కలిసి పనిచేద్దాం..మళ్ళీ గెలుద్దాం: మంత్రి పువ్వాడ
== హ్యాట్రిక్ సాధించడమే ఏకైక లక్ష్యం 
== సమన్వయంతో ముందుకు సాగుదాం..*
== ఊరూరా అభివృద్ధి.. గడపగడపకూ సంక్షేమం.*
== బీఆర్‌ఎస్‌ ఆత్మీయ సమ్మేళనంలో శ్రేణులకు పిలుపునిచ్చిన మంత్రి పువ్వాడ.
(ఖమ్మం ప్రతినిధి -విజయం న్యూస్)

రానున్న ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ అజేయ విజయాన్ని సొంతం చేసుకొని మూడోసారి సీఎం కేసీఆర్‌   నాయకత్వంలో రాష్ట్రంలో అధికారంలోకి రావటాన్ని ఏ శక్తి ఆపలేదని, అందుకు నాయకులు కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి విజయాన్ని సాధించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  పార్టీ శ్రేణులు పిలుపునిచ్చారు. బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటిఅర్ ఆదేశాల మేరకు ఎర్పాటు చేసిన ఖమ్మం నియోజకవర్గ పార్టీ ప్రతినిధుల సమావేశంలో మంత్రి పువ్వాడ మాట్లాడారు.

 

కేసీఅర్ నాయకత్వంలో 9 ఏండ్ల కాలంలో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని తద్వారా రాష్ట్రంలో మూడోసారి అధికారంలోకి రావాలనే పట్టుదలతో గులాబీ నేతలు కృషి చేయలని సూచించారు. రానున్న ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పార్టీని మళ్ళీ గెలిపించి హ్యాట్రిక్ విజయాన్ని అందించాలని, మూడోసారి గెలిపించి మళ్ళీ సీఎం కేసీఆర్‌కి ముఖ్యమంత్రి చేసుకోవాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు, రజక సంఘం రాష్ట్ర నాయకులు రెగళ్ళ కొండల అధ్వర్యంలో పలువురు మంత్రి పువ్వాడ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
రఘునాధపాలెం మండలం వెపకుంట్ల గ్రామం నుండి సీపీఐఎంఎల్  పార్టీ నుండి శీలం మల్లయ్య అధ్వర్యంలో పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలని పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు ప్రజలకు వివరించాలని సూచించారు. బీజేపీయేతర పాలిత రాష్ర్టాలపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలను ఎక్కడికక్కడ వివరించాలన్నారు.
సీబీఐ, ఈడీ, ఐటీలను కేంద్రం తన స్వార్థరాజకీయాల కోసం ఎలా వాడుకుంటున్నదో ప్రజలకు చెప్పాలని హితబోధ చేశారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం నగర మేయర్ పూనకల్లు నీరజ, చైర్మన్ సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ దోరేపల్లి శ్వేత, మాజీ చైర్మన్ ఆర్జేసీ కృష్ణ, బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు తదితరులు హాజరయ్యారు.