Telugu News

పేదల ఇళ్ల పట్టాల పంపీణీలో మనమే నంబర్‌ వన్- మంత్రి పువ్వాడ.

ఖమ్మం నగరంలో లబ్దిదారులకు పట్టాలు పంపిణి చేసిన మంత్రి

0

పేదల ఇళ్ల పట్టాల పంపీణీలో మనమే నంబర్‌ వన్- మంత్రి పువ్వాడ.
== ఖమ్మం నగరంలో లబ్దిదారులకు పట్టాలు పంపిణి చేసిన మంత్రి
(ఖమ్మం ప్రతినిధి-విజయంన్యూస్)
ఏళ్ళ తరబడి స్థిరనివాసం లేకుండా, ఎలాంటి హక్కులు లేకుండా ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకుని జీవనం కొనసాగిస్తున్న పేదలకు శాశ్వత పట్టాలను అందిస్తున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సహకారంతో నేడు ఖమ్మం నగరంలోని అనేక ప్రాంతాలలో దాదాపు 2500 శాశ్వత పట్టాలను పంపిణి పంపిణి చేయడం జరిగిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోనెం.58,59 కు లోబడి సుదీర్ఘంగా నివాసాలు ఏర్పాటు చేసుకున్న వారికి ఇళ్ళ పట్టాల పంపిణిలో భాగంగా ఆదివారం 8వ డివిజన్ గొల్లగుడెం నందు మొత్తం 569 పట్టాలను మంత్రి పంపిణి చేశారు.

also read :-కోస్తా తీరంలో పారిశ్రామిక కెరటాలు

8వ డివిజన్ కొత్తగూడెంలో 199, గోల్లగుడెంలో 370 మొత్తం 569 పట్టాలను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు స్వయంగా పంపిణీ చేశారు. ఆదివారం గోళ్ళగూడెంలో పట్టాల పంపిణి అనంతరం మంత్రి మాట్లాడుతూ.. పేదలందరికీ ఇళ్ల పట్టాల పంపిణీలో ఖమ్మం ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలిచిందన్నారు. పేదలకు శాశ్వతంగా ఆవాసాలను కల్పించే పట్టాల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్రంలోనే నంబర్‌ వన్‌ స్థానంలో ఖమ్మం నిలిచిందన్నారు. ఎన్నో ఏళ్లుగా నిరుపేదలు కంటున్న కలలను నిజం చేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోనెంబర్. 58, 59 ద్వారా లక్షల మంది జీవితాల్లో వెలుగులు నింపాయని మంత్రి కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చాక ఒక్కో సమస్యకు ముఖ్యమంత్రి వర్యులు పరిష్కారం చూపుతున్నారని వివరించారు.

also read :-పట్టాలతో పేదలకు శాశ్వత ఉపశమనం .. మంత్రి పువ్వాడ.

ఖమ్మం నగర సర్వతాముకాభివృద్దే లక్ష్యంగా పని చేస్తున్నామని, ప్రాంతాలకు, కులాలకు, పార్టీలకు అతీతంగా అభివృద్ధి, సంక్షేమం ప్రతి ఇంటికి అందిస్తున్నామని మంత్రి పేర్కోన్నారు. పేదల కళ్ళల్లో ఆనందం చూడటమే తమ లక్ష్యమని అభివృద్ధిలో ఖమ్మాన్ని చూసి రాష్ట్రం అంతా ఆదర్శంగా తీసుకునే స్థాయికి తీసుకెళతానని హామి ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ , డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహారా , డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, సుడా చైర్మన్ విజయ్ కుమార్, కార్పొరేటర్లు కూరాకుల వలరాజు, కొత్తపల్లి నీరజ, నాగండ్ల కోటి, ఏఎంసీ చైర్మన్ లక్ష్మి ప్రసన్న, తహసిల్దార్ శైలజ, పగడాల నాగరాజు, దేవభక్తుని కిషోర్ బాబు, ముక్తార్ తదితరులు పాల్గొన్నారు