Telugu News

పేపర్ లీకేజ్ కి మంత్రి కేటీఆర్ బాధ్యుడు: బీజేపీ 

మంత్రి కేటీఆర్ తక్షణమే రాజీనామా చేయాలి

0

పేపర్ లీకేజ్ కి మంత్రి కేటీఆర్ బాధ్యుడు: బీజేపీ 

== మంత్రి కేటీఆర్ తక్షణమే రాజీనామా చేయాలి

== బీజేపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ

== ఖమ్మం ధర్నాచౌక్ లో నిరసన దీక్ష చేసిన బీజేపీ

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

టీఎస్పీఎస్సీ పరీక్ష పేపర్ లీకేజ్ కు నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ, భారతీయ జనతా పార్టీ ఖమ్మం జిల్లా అధ్యక్షులు గల్లా సత్యనారాయణ ఆధ్వర్యంలో ఖమ్మం నగరంలోని ధర్నా చౌక్ వద్ద నిరసన దీక్ష నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా గల్లా సత్యనారాయణ మాట్లాడుతూ, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వల్ల సుమారు 30 లక్షల మంది విద్యార్థుల జీవితాలు అగమ్య గోచరంగా మారాయని, ఎంతో కష్టనష్టాలకు వచ్చి లక్షలాది రూపాయలు ఫీజులు చెల్లించి కోచింగ్ తీసుకొని విద్యార్థులు పరీక్షలు రాసిన తర్వాత పేపర్ లీకేజ్ వ్యవహారం వెలుగులోకి వచ్చి యువత మొత్తం నిరాశ మానసిక క్షోభకు గురవుతున్నారని, వెంటనే రాష్ట్ర ప్రభుత్వం టీఎస్పీఎస్సీ పరీక్ష రాసిన ప్రతి విద్యార్థికి లక్ష రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.

ఇదికూడా చదవండి: మహిళ బిల్లు సంగతేంటి..?

రాష్ట్ర మంత్రి కేటీఆర్ అండదండలతోటే పేపర్ లీకేజ్ అనేది జరిగిందని డబ్బులకి కకృతి పడి ఈ విధంగా విద్యార్థుల యొక్క జీవితాలతో ముఖ్యమంత్రి కుటుంబం చెలగాటమాడుతుందని పేపర్ లీకేజీ పై సిట్టింగ్ జడ్జితో దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కుటుంబం మొత్తం ఒకవైపు లిక్కర్ దందాలో మరొకరు పరీక్ష పేపర్లు లీక్ చేసే దందాలో ఉన్నారని వీరిని ఆదర్శంగా తీసుకొని టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రులు ఎక్కడ చూసినా సాండ్ మాఫియా గ్రావెల్ మాఫియా భూముల కబ్జాలతో టిఆర్ఎస్ ప్రభుత్వం మొత్తం మసకబారిపోయిందని రాష్ట్ర ప్రజలు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎప్పుడు ఎన్నికలు జరిగినా బొంద పెడతారని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు గెంటెల విద్యాసాగర్, దేవకి వాసుదేవరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి రుద్ర ప్రదీప్, జిల్లా ఉపాధ్యక్షులు మందా సరస్వతి, బోయినపల్లి చంద్రశేఖర్, వేల్పుల సుధాకర్, గుత్తా వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి నకరికంటి వీరభద్రం, జిల్లా అధికార ప్రతినిధి వీరవల్లి రాజేష్ గుప్తా, మహిళా మోర్చా జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శిలు దొడ్డ అరుణ, పమ్మి అనిత, అర్బన్ టౌన్ అధ్యక్షులు కుమిలి శ్రీనివాస్, టూ టౌన్ అధ్యక్షులు తాజ్ నూత్ భద్రం, త్రీ టౌన్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ గుప్తా, రఘునాథపాలెం మండల అధ్యక్షులు పొట్లపల్లి నాగేశ్వరరావు, నాయకులు ఢీకొండా శ్యామ్, శాసనాల సాయిరాం, అంకతి పాపారావు, సురేష్, పసుమర్తి సతీష్, జంగిల్ రమణ, శంకర్ గౌడ్, ఫణి కుమారి, సుగుణ, జంపా, వల్లాల రమేష్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: ఖమ్మం మార్కెట్ లో మిర్చికి రికార్డ్ ధర