Telugu News

కృష్ణంరాజు మరణం పట్ల మంత్రి పువ్వాడ సంతాపం

ఆత్మకుశాంతించాలని కోరిన మంత్రి 

0

కృష్ణంరాజు మరణం పట్ల మంత్రి పువ్వాడ సంతాపం

** ఆత్మకుశాంతించాలని కోరిన మంత్రి 

(ఖమ్మం-విజయం న్యూస్)

ప్రముఖ చలనచిత్ర నటుడు, తెలుగు సినీహీరో  మాజీ కేంద్రమంత్రి, కృష్ణంరాజు మరణం పట్ల మంత్రి పువ్వాడ సంతాపం ప్రకటించారు.

Allso read:-రెబల్ స్టార్ కృష్ణంరాజు ఇక లేరు…

తాను యాభై ఏండ్ల సినీ ప్రస్థానంలో అనేక సినిమాల్లో హీరోగా నటించి, తన విలక్షణ నటనాశైలితో, ‘రెబల్ స్టార్’ గా సినీ ప్రేక్షకుల హృదయాల్లో అభిమానం సంపాదించుకున్న కృష్ణంరాజు(ఉప్పలపాటి వెంకట కృష్ణంరాజు) మరణం, తెలుగు వెండితెరకు తీరని లోటని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  పేర్కొన్నారు.

లోక్ సభ సభ్యునిగా, కేంద్ర మంత్రిగా,  రాజకీయ పాలనా రంగం ద్వారా, దేశ ప్రజలకు సేవలందించిన కృష్ణంరాజు మరణం విచారకరమని అన్నారు.

వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.  దివంగత కృష్ణంరాజు కుటుంబ సభ్యులకు మంత్రి పువ్వాడ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Allso read:- కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ