బిజెపి నేతలు చర్య దుర్మార్గమైనది
◆ఎమ్మెల్సీ కవితను పరామర్శించిన మంత్రి పువ్వాడ అజయ్
ఖమ్మం ప్రతినిధి, ఆగస్టు 28(విజయంన్యూస్)
◆నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంటిపై బిజెపి నేతలు దాడి చేయడం దారుణమని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఆదివారం ఎమ్మెల్సీ కవితను మంత్రి పువ్వాడ అజయ్ కలిసి సంఘీభావం తెలిపారు.ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ మాట్లాడుతూ బిజెపి నేతలు ఇలాంటి పనులు చేయడం సిగ్గుచేటని టిఆర్ఎస్ పార్టీకి లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు అని వారు మీ ఇండ్లమీదికి,పార్టీ ఆఫీసుల మీదకు వస్తే మీ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.మేము సహనంతో ఉన్నామని మంత్రి అజయ్ అన్నారు.బీజేపీ నేతల వ్యవహరించిన తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన తెలిపారు.ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. పరామర్శించిన వారిలో ఆలేరు శాసనసభ్యులు,ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గంగాలయ సంస్థ చైర్మన్ దిండిగాల రాజేందర్ తదితరులు ఉన్నారు.
allso read0- కవులు, రచయితలు తెలంగాణకు రెండు కళ్ళు: మంత్రి పువ్వాడ