తిరుపతి వెంకన్నను దర్శించుకున్న మంత్రి పువ్వాడ
కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రత్యేక దర్శనం..మొక్కులు అప్పగింత
తిరుపతి వెంకన్నను దర్శించుకున్న మంత్రి పువ్వాడ
== కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రత్యేక దర్శనం..మొక్కులు అప్పగింత
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శనం సమయంలో శ్రీవారిని దర్శించుకుని మంత్రి పువ్వాడ మొక్కులు తీర్చుకున్నారు.
ఇది కూడా చదవండి: కనివిని ఎరుగని రీతిలో ఖమ్మం అభివద్ది: మంత్రి
దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు వేదపండితులు ఆశీర్వచనం అందించగా, టీటీడీ ఆలయ అధికారులు స్వామివారి తీర్ధప్రసాదాలను, పట్టువస్త్రాలను అందజేశారు. అనంతరం మంత్రి అజయ్ మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాలు ప్రగతిపథంలో నడవాలని స్వామి వారిని వేడుకున్నట్లు తెలిపారు. కేసీఆర్ గారు దేశ రాజకీయాల్లో కీలక భూమిక పోషిస్తారని ఆయన నాయకత్వాన్ని యావత్ దేశం కోరుకుంటున్నదని మంత్రి అజయ్ గారు అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు దేశవ్యాప్తంగా అమలవ్వాలని సహజ వనరులతో తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ గారు అభివృద్ధి చేశారని మంత్రి పువ్వాడ తెలిపారు.
ఇది కూడా చదవండి: రూ.2వేల నోట్ రద్దు