పట్టణ ప్రగతిపై మంత్రులు కేటీఆర్, పువ్వాడ అజయ్ సమీక్ష
(ఖమ్మంప్రతినిధి-విజయం న్యూస్);-
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంపై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్లో జరిగిన ఈ సమీక్షలో మంత్రి శ్రీ కేటీఆర్ తో పాటు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పాల్గొన్నారు. మంత్రుల సమీక్ష సమావేశానికి మేయర్లు, మున్సిపల్ చైర్పర్సన్లు, కమిషనర్లు, మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పట్టణ ప్రగతి కార్యక్రమ విధివిధానాలపై మంత్రులు శ్రీ కేటీఆర్, పువ్వాడ అజయ్ కుమార్ దిశానిర్ధేశం చేశారుఅనంతరం రాష్ట్రంలోని పలు మున్సిపాలిటీలకు పట్టణ ప్రగతి అవార్డులను మంత్రులు అందజేశారు.
also read :-ఖమ్మం కార్పొరేషన్ కు శుభవార్త
రాష్ట్రంలోని నగరాలు, పట్టణవాసులకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పట్టణ ప్రగతి కార్యక్రమం చేపట్టింది. ఇందులో భాగంగా వార్డుల వారీగా అభివృద్ధి కార్యక్రమాల సమీక్ష, సీజనల్ వ్యాధుల నివారణ కోసం పారిశుధ్య కార్యక్రమాలు, నీటి నిల్వల తొలగింపు, దోమల నివారణకు మందుల స్ప్రేయింగ్, చెత్త తొలగింపు, రహదారుల వెంట పిచ్చి మొక్కలు, భవన నిర్మాణ వ్యర్థాల తొలగింపు, శిథిల భవనాల కూల్చివేత, ఖాళీ స్థలాల్లో హరితహారం వంటి పనులను నిర్వహిస్తారు. ఐదోవిడత పట్టణ ప్రగతి కార్యక్రమం ఈ నెల 20 నుంచి జూన్ 5 వరకు జరుగనుంది