★ ఢిల్లీ పర్యటనలో రాష్ట్ర మంత్రులు
★ నేడు కేంద్రమంత్రితో సమావేశం
(తెలంగాణ విజయం న్యూస్):-
ధాన్యం కొనుగోలుపై కేంద్రమంత్రి పీయూష్ గోయల్ను మంగళవారం మధ్యాహ్నం తెలంగాణ రాష్ట్ర మంత్రులు నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, గంగుల కమలాకర్, ప్రశాంత్ రెడ్డి కలవనున్నారు రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోలు చేయాలని మంత్రులు విజ్ఞప్తి చేయనున్నారు.
also read :-ములుగు ఎమ్మెల్యే సీతక్కను కలిసిన గిరిజన పార్ట్ టైం ఉపాధ్యాయులు
మధ్యాహ్నం 12:30 గంటల సమయంలో ఈ సమావేశం ప్రారంభం కానుంది. అనంతరం మీడియాతో మంత్రులు మాట్లాడనున్నారు. కేంద్ర మంత్రి షేకావత్, ఇతర మంత్రులతోనూ తెలంగాణ మంత్రులు సమావేశం కానున్నారు. మంత్రుల ఢిల్లీ పర్యటన మరో 4 రోజులు కొనసాగే అవకాశం ఉంది.