Telugu News

టీఆర్ఎస్ ది గెలుపు కాదు.. నాదే నైతిక గెలుపు: రాజగోపాల్ రెడ్డి

ఆధర్మ పద్దతిలో టీఆర్ఎస్ గెలిచింది

0

టీఆర్ఎస్ ది గెలుపు కాదు.. నాదే నైతిక గెలుపుః రాజగోపాల్ రెడ్డి

== ఆధర్మ పద్దతిలో టీఆర్ఎస్ గెలిచింది

== మునుగోడు ప్రజలు ఇచ్చిన తీర్పు గౌరవిస్తున్న

== నన్ను ప్రచారం చేయకుండా అడ్డుకున్నారు

== మంత్రులందరు ఫలితాల వరకు మునుగోడులోనే ఉండి డబ్బులు పంపిణి చేశారు. 

== విలేకర్లతో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి 

(మునుగోడు-విజయంన్యూస్)

టీఆర్ఎస్ ది గెలుపే కాదని, నాదే నైతిక గెలుపు నాదేనని బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. ఆధర్మ పద్దతిలో డబ్బు ప్రభావంతో టీఆర్ఎస్ గెలిచిందని ఆరోపించారు. మునుగోడు ప్రజలు ఇచ్చిన తీర్పు గౌరవిస్తున్నట్లు ప్రకటించారు. ఆదివారం మునుగోడు ఎన్నికల ఫలితాల అనంతరం కౌంటింగ్ కేంద్రాల నుంచి బయటకు వచ్చిన రాజగోపాల్ రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ అధికార టిఆర్ఎస్ దుర్మరంగా నన్ను ప్రచారం చేయకుండా అడ్డుకున్నారని అన్నారు. భారతదేశ చరిత్రలో ఎలక్షన్స్ మధ్యలో ఒక రిటర్నింగ్ ఆఫీసర్ ని సస్పెండ్ చేయడం మొట్టమొదటిసారి జరిగిందని, ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి  కేటీఆర్ బాగా ఒత్తిడి తీసుకొచ్చి రిటర్నింగ్ ఆఫీసర్ తోటి బాగా తప్పులు చేపిస్తే సస్పెండ్ చేయడం జరిగిందన్నారు.

ఇది కూడా చదవండి: 7 వేల దాటిన టీఆర్ఎస్ మెజారిటీ

ఆయన ఇంకేమన్నారో..ఆయన మాటల్లోనే
పోలీసులు ఏక పక్షంగా వ్యవహరించి ఎన్నికల నిబంధనలకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు మంత్రులు టిఆర్ఎస్ నాయకులు మొత్తం మూడో తారీకు సాయంత్రం వరకు మునుగోడు లోనే ఉండి డబ్బు మొత్తం పంచి ప్రలోభాలు పెట్టి అధర్మంగా గెలిచే ప్రయత్నం చేయడం జరిగింది
మా నాయకుల్ని నన్ను పోలీసులు అష్టదిగ్బంధంగా చేశారు
గ్రామాలకు ఎమ్మెల్యే గ్రామానికి మంత్రి భారతదేశంలో కనివిని ఎరుగని విధంగా అవినీతి సొమ్ముతో మద్యం ఏరులై పారించి ఎన్నికల్లో అధర్మం గెలిచే విధంగా అడ్డదారులు తొక్కారు
సింబల్స్ కూడా కరెక్టుగా అలాట్ చేయలేదు

ఇది కూడా చదవండి: అరెకోడులో అక్రమంగా మట్టి తవ్వకాలు
31 తారీకు వరకు బిజెపికి అనుకూలంగా ఉంది
ఒకటవ తారీకు సాయంత్రం ఎన్నికల నిబంధన ప్రకారం బయట నుంచి వచ్చిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు వెళ్లకుండా పోలీసులు ఏక పక్షంగా వ్యవహరించి పక్షపాతం చూపించారు
మూడో తారీకు సాయంత్రం వరకు డబ్బులు పంచుకుంటూ ప్రలోభాల కు గురిచేసి బెదిరించి ప్రచారం చేయకుండా దుర్మార్గంగా అడ్డ దారుల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేలాగా ప్రవర్తించిన తీరు తెలంగాణ సమాజం గమనించాలి
ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తిని ఓడ కొట్టడానికి వంద మంది గౌరవ సైన్యం అధికార యంత్రాంగం పోలీసు యంత్రాంగం వచ్చాయి

వాళ్ళకనుకూలమైన వ్యక్తుల్ని నామినేషన్ వేయడానికి ముందే పోస్టింగ్ ఇచ్చారు
మేము గట్టి పోటీ ఇచ్చాము ఎన్నికల్లో నైతికంగా నేను గెలిచాను
ముఖ్యమంత్రి అడ్డదారులతో గెలిచిన అనుకుంటుండు గాని అది ఓన్లీ నెంబర్ గేమ్ మాత్రమే
8 ఏళ్లుగా నిజంగా అభివృద్ధి చేసినట్లయితే అంత మంది అవసరం లేదు,డబ్బులు అవసరం లేదు, అంత అధికార దుర్వినియోగం అవసరం లేదు

ప్రలోభాల వల్ల ఒత్తిడి వల్ల దుర్మార్గం వల్ల అధర్మంగా గెలిచారు
తెలంగాణలో ఎక్కడ కూడా గొర్రె పంపిణీ చేయలేదు కానీ ఎన్నికలు వచ్చాయి అని ఇక్కడ చేశారు
గొల్ల కురుమలకు డబ్బులు వేయకుండా ఆపి బెదిరించడంతో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మంత్రిని రెండు రోజులు ప్రచారానికి దూరంగా ఉంచింది
రాబోయే రోజుల్లో మా పోరాటం కొనసాగుతుంది
ప్రజల పక్షాన కుటుంబ పాలన పోగొట్టడానికి రాచరిక పాలనను పోగొట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి బిజెపి పోరాడుతుంది

ఇది కూడా చదవంఢి : జుజ్జులరావుపేట వెంచర్ పై అధికారుల నజర్ 
తెలంగాణ ఉద్యమకారులు ప్రజాస్వామ్యవాదులు మేధావులు యువత ఎంతమంది నా గెలుపు కోసం కృషి చేశారు వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు
ఒక వ్యక్తిని ఓడ కొట్టడానికి ప్రభుత్వమే కదిలి వచ్చింది
దుర్మార్గంగా వారు గెలిచారు
ప్రజల మనసులో నేనున్నా…
ఆరోజు తెలంగాణ కోసం పార్లమెంట్లో ఎలాగైతే కొట్లాడానో.. నా ప్రాణం ఉన్నంతవరకు కెసిఆర్ పై పోరాటం కొనసాగుతుంది…
కెసిఆర్ కు అవినీతి సొమ్ముకు కమ్యూనిస్టు నాయకులు అమ్ముడు పోయారు
కమ్యూనిస్టులకు కనీసం ప్రగతి భవన్లో అపాయింట్మెంట్… ఇవ్వని ముఖ్య మంత్రి కి బుద్ధి చెప్పాల్సింది పోయి ఆయన పంచన చేరారు