నా జెండా.. ఏజెండా అదే
== ఆయన్ను గద్దె దించుడే నా లక్ష్యం
== రాబోయే ఎన్నికల్లో శీనన్న జెండా… ఎజెండా ఇదే
== పాలేరు ఆత్మీయ సమ్మేళనంలో పొంగులేటి సంచలన వ్యాఖ్యలు
== సీతారామ ప్రాజెక్టు నీళ్లతో పాలేరు ప్రజల కాళ్లు ఎప్పుడు కడుగుతారు
== తెలంగాణ రాష్ట్రం లో ఐదు లక్షల కోట్లు అప్పులు
== ప్రాణ త్యాగాలు చేసిన విద్యార్థుల ఆత్మ గోసిస్తుంది
(ఖమ్మంప్రతినిధి, తిరుమలాయపాలెం-విజయంన్యూస్):
నా జెండా..ఏజెండా ఒక్కటే.. ఆయన్ను గద్దె దించడమే శీనన్న జెండా..ఏజెండా.. అంతేకాదు..శీనన్నను నడిపించే అక్కాచెల్లెళ్ల..అన్నతమ్ముళ్లది కూడా ఇదే జెండా.. ఏజెండా.. రాబోయే ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ను గద్దె దించుడే నా ఏకైక ఏజెండా అని మాజీ పార్లమెంట్ సభ్యుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు.
allso read- మాటలకే తప్ప చేతలు శూన్యం: పొంగులేటి
జెండా ఏదైనా ఎజెండా ఒకటేనని తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దించడం మా ఏజెండా అని, ఖమ్మం జిల్లాలో ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యేలను ఓడగొట్టడమే లక్ష్యమని ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. పాలేరు నియోజకవర్గంలోని తిరుమలాయపాలెం మండల కేంద్రంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనానికి హాజరైన వేలాది మంది ప్రజల ను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్రంలో ఎంతోమంది విద్యార్థుల ప్రాణ త్యాగాలతో సాధించుకున్న తెలంగాణలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. రాష్ట్రం సుమారు ఐదు లక్షల కోట్ల రూపాయలు అప్పుల్లో కూరుకుందన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి మనిషి పై 1,35,000 అప్పు ఉందని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాలో భారీ ప్రాజెక్టు సీతారామ ప్రాజెక్టుగా చెప్పుకుంటున్న అధికార పార్టీ ప్రాజెక్టు నీళ్లతో పాలేరు ప్రజల కాళ్లు ఎప్పుడు కడుగుతారో చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభల్లోనూ అసెంబ్లీ సాక్షిగా చేసిన వాగ్దానాలు అమలు కాలేదన్నారు. కేసీఆర్ ని కేటీఆర్ ను నమ్మి టిఆర్ఎస్ లో చేరాను ఆ తర్వాత వారి చేష్టాలు నన్ను ఇబ్బందులకు గురిచేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో ప్రజలే దానికి సమాధానం చెబుతారని, కేసీఆర్ మాయ మాటలు ప్రజలు నమ్మరన్నారు. రానున్న రోజుల్లో జరిగే ఎన్నికల కురుక్షేత్రంలో అధికార పార్టీని మట్టి కరిపించడమే శీనన్న టీం లక్ష్యమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు తీసుకున్న వ్యవసాయ రుణాలను మాఫీ చేస్తానని రెండోసారి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఇంతవరకు ఐదు లక్షల మందికి రుణమాఫీ చేశారని ఇంకా 31 లక్షల మంది చేయాల్సి ఉందని అన్నారు. ఇంకా ఎన్నికలకు ఏడు నెలల సమయం ఉందని ఎప్పుడు రుణమాఫీ చేస్తారని ఆయన ప్రశ్నించారు. మాయ మాటలు – మోసపు వాగ్దానాలు.. కన్నీళ్లు – అప్పులు- ఆత్మహత్యలే మిగిలాయి తెలంగాణ లో…
allso read- పొంగులేటి వర్గంలో ‘పాలేరు’ అభ్యర్థి ఎవరు..?
బంగారు తెలంగాణ కలలు కల్లలైయ్యాయని ఆరోపించారు. ఆరు శతాభ్దాలుగా సబ్బండ వర్గాల ప్రజలు పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ బిడ్డలు దగా పడ్డారని ఆరోపించారు. ధనిక రాష్ట్రమైన తెలంగాణా ను ఈ ప్రభుత్వం రూ.5 లక్షల కోట్ల అప్పుల్లోకి నెట్టిందని, ప్రతి కుటుంబంపై లక్షకు పైగా అప్పు ఉందని ఆరోపించారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణ, ఇప్పుడు నీళ్ల కోసం నిధుల కోసం, బతుకు కోసం పోరాటం చేయాల్చి వస్తుందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే బతుకులు మారిఫోతాయని కన్న కలలు కల్లగానే మిగిలాయని ఆరోపించారు. గడిచిన నాలుగు సంవత్సరాలలో రైతు రుణ మాఫీ ఎంత చేశారని ప్రశ్నించారు..? దళిత బంధు పథకం కింది ప్రతి నియోజకవర్గంలో వంద మందికి ఇచ్చి చేతులు దులుపుకున్నవారు ఇప్పుడు గిరిజన బందు అంటూ మాట్లాడుతున్నారని ఆరోపించారు…ప్రతి ఎన్నికల్లో చేట లో తవుడు పోసి కుక్కలను ఉసికోల్పినట్లు ఉందని, రాష్ట్ర 4.2 శాతం మాత్రమే వైద్యం కోసం బడ్జెట్ లో నిధులు కేటాయించి ప్రజలను వైద్యానికి దూరం చేస్తున్నారని ఆరోపించారు. విద్య కోసం 6.5 శాతం నిధులు కేటాయించి విద్యను దూరం చేస్తుంది ఈ ప్రభుత్వం, ప్రజలను భయపెట్టి రెంఢు సార్లు అధికారంలోకి వచ్చిందన్నారు.
allso read- బీజేపా..? కాంగ్రెసా..? పొంగులేటి ఎటువైపు..?
సీతారామ ప్రాజెక్ట్ నీళ్లతో పాలేరు ప్రజల కాళ్లు కడుగుతానని చెప్పిన మాటలు పూర్తయ్యేదెప్పుడో, ప్రజల కాళ్లు కడిగేదేప్పుడని ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రావడం కాదు, ఇప్పుడు ఉన్న ప్రజాప్రతినిధులు ఉప్పెనలో కొట్టుకు పోవడం ఖాయమని జోస్యం చెప్పారు. ఎవరెన్ని ఆటంకాలు కల్పించినా ఏ గూటి పక్షి ఆ గూటికే పోతుంది, ఇప్పుడు మీటింగ్ కు రాకుండా ఆపిన వారందరకు కూడా శీనన్నను ఆశీర్వదిస్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో మద్దినేని బేబీ స్వర్ణకుమారి, మువ్వా విజయబాబు, తుళ్లూరి బ్రహ్మయ్య, బొర్రా రాజశేఖర్, రామ సహాయం నరేష్ రెడ్డి, చావా శివరామకృష్ణ, డాక్టర్ కోట రాంబాబు, విజయ బాయి, మాజీ ఎంపీపీ కొప్పుల అశోక్, నెల్లూరి భద్రయ్య, బజ్జూరి వెంకట్ రెడ్డి, కొడాలి గోవిందరావు, చెరువు స్వర్ణ, అజ్మీరా అశోక్, మద్ది కిషోర్ రెడ్డి, తిప్పిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, సుబ్రహ్మణ్యం, రవీంద్రబాబు, జీవన్ రెడ్డి, శివ సాగర్, దుబ్బాకుల వెంకటేశ్వర్లు, ఎన్ వి శేషు, కొప్పుల చంద్రశేఖర్, కార్పొరేటర్ దొడ్డా నగేష్, పీఎస్ఆర్ యువజన విభాగం అధ్యక్షుడు మొగిలిశెట్టి నరేష్, యువనేత గోపి తదితరులు పాల్గొన్నారు.