Telugu News

“కందాళ”కు పరీక్షే నా..?

స్వంత పార్టీలో ఇంటి పోరు

0

 “కందాళ”కు పరీక్షే నా..?

• మలి విజయం వైపు ఎమ్మెల్యే  అడుగులు
●సొంత డబ్బులతో అభివృద్ది పనులు
●విస్తృత జన సంబంధాలు
●జననేతగా గుర్తింపు..

• స్వంతపార్టీలో ఇంటి పోరుతో సతమతం

• తుమ్మల నుంచి విపరీతమైన పోటీ

(కూసుమంచి -విజయం న్యూస్)

పాలేరు నియోజకవర్గంలో అపర ధానకర్ణుడిగా పేరు సంపాదించుకున్న ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి  మరోసారి విజయం కోసం అడుగులు వేస్తున్నారు.. అందుకోసం ముందునుంచే ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. అనేక సేవా కార్యక్రమాలను అందిస్తూ పేదప్రజలకు దగ్గరవుతున్నారు. పలు శుభకార్యాలకు వెళ్తూ ప్రతి ఒక్క కుటుంబానికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఇంటింట జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కుల మత భేదాలు లేకుండా అందర్ని అప్యాయంగా పలకరిస్తూ మీలో నేను ఒకడ్ని అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో పాటు యువకులను ఆకట్టుకుంటున్నారు. గుడ్లకు, బడ్లకు మస్తుగా పైసలు ఇస్తూ అన్ని మతాల ప్రజలను ఆకట్టుకుంటున్నారు.

Allso read-“మట్టా” పయనమెటో….?

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలుండగా మూడు మాత్రమే జనరల్ స్థానాలు అందులో పాలేరు నియోజకవర్గం ఒకటి. దీంతో అందరి చూపు ఇటువైపు పడింది. 2018 ఎన్నికల్లో కందాళ ఉపేందర్ రెడ్డి కాంగ్రెసు పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి సీనియర్ రాజకీయ నేత తుమ్మల నాగేశ్వరరావు పై విజయం సాధించారు. అనంతర పరిణామాల నేపథ్యంలో కందాళ ఉపేందర్ రెడ్డి బిఆర్ఎస్ లో చేరారు. దీంతో పాలేరు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారి బిఆర్ఎస్ బలమైన శక్తిగా అవతరించింది. కందాళ చేయూత పేరుతో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా పాలేరు నియోజకవర్గంలో మృతి చెందిన ప్రతి కుటుంబానికీ రూ. 10 వేల చొప్పున అందిస్తున్నారు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి. అలాగే గుడ్లు, చర్చలు, మసీదుల నిర్మాణానికి లక్షలాది రూపాయలు అందిస్తున్నారు.

Allso read:- స్వంత గూటికా..?సోదరి గూటికా..?  పొంగులేటి దారేటు..?

కోట్లాది రూపాయల వెచ్చించి నిరిధ్యోగులకు ఉచిత కోచింగ్ సెంటర్ నిర్వహించారు. వారికి కావాల్సిన మెటీరియల్ అందజేశారు. అక్కడ కోసింగ్ పొందిన అనేక మంది పోలీసు ఉద్యోగాల్లో ఎంపికయ్యారు. ఎంపికైన వారి కోసం ఉచిత శిక్షణా శిబిరం ఏర్పాటు చేశారు. అంతే కాకుండా అనేక మంది పేద విద్యార్థులను ఉన్నత చదువులు చదివి స్తున్నారు. తక్షణ వైద్యం అందించేందుకు గాను అంబులెన్స్ లు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం నిధులు కాకుండా తన సొంత డబ్బులు వెచ్చించి రహదారి మరమ్మత్తు పనులు చేపడుతున్నారు. ఇటీవల గుడ్ మార్నింగ్ పాలేరు పేరుతో నియోజకవర్గంలో పర్యటించి సమస్యలను తెలుసుకొని తక్షణమే అక్కడికక్కడే పరిష్కారం చూపుతున్నారు. ఏ మాత్రం సమయం దొరికినా ప్రజల మద్యనే ఉండేందుకు ప్రయత్నిస్తూ ముందుకు సాగుతుందన్నారు. ఒకప్పుడు కాంట్రాక్టర్ గా ప్రజల్లోకి వెళ్లిన కందాళ ఉపేందర్ రెడ్డి ఇప్పుడు జన నేతగా ఎదిగారు. ఆనాడే బలమైన నేతను ఢీకొని విజయం సాధించిన కందాళకు మలి విజయం సాధించడం పెద్ద కష్టమేమీ కాదనే ప్రచారం జరుగుతున్నప్పటికీ బీఆర్ఎస్ లో వర్గపోరు, టిక్కెట్ స్పష్టత లేకపోవడం, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్ లోకి రావడం, గెలిపించిన వారికి చెప్పకుండా పార్టీ మారడం, ప్రస్తుతం కాంగ్రెస్ వాళ్ళకే పనిచేస్తున్నారనే ఆరోపణలు రావడం, ఆ నలుగురికే ప్రాధాన్యత కల్పించడం వల్ల ప్రజల్లో, బీఆర్ఎస్ పార్టీలో కొంత వ్యతిరేక ఉంది. ఈ క్రమంలో గెలుపు అంత ఈజీ కాదని స్పష్టంగా తెలుస్తుంది. ఇదే గ్రహాంచిన ఎమ్మెల్యే కందాళ ఇప్పటినుంచే ప్రజల్లోకి వెళ్తున్నారు. ఎవరు పిలిచినా పలుకుతున్నారు. ఎవర్ని కాదనకుండా నొప్పించకుండా పనిచేస్తున్నారు. ఇక సేవా కార్యక్రమాలైయితే లెక్కలేదు. అందినకాడికి సహాయం అందిస్తూ వస్తున్నారు.

== సరైనా ప్రత్యర్థి లేకపోవడం ప్లస్సేనా..?

పాలేరు నియోజకవర్గం అంటేనే కాంగ్రెస్ కు కంచుకోట. 14సార్లు ఎన్నికలు జరిగితే అందులో 10సార్లు కాంగ్రెస్, సీపీఎం రెండు సార్లు, సీపీఐ, జనతా విజయం సాధించాయి. రెండు సార్లు ఉప ఎన్నికలు జరగ్గా కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీ ఒకొక్క సారి విజయం సొంధించాయి‌.  కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికీ ఖచ్చితమైన ఓటు బ్యాంకు ఉన్నప్పటికీ నాయకత్వ లేమి పెద్ద మైనస్ గా మారింది. ఉన్న వారిలో వర్గపోరు కందాళ ఉపేందర్ రెడ్డి  కి కలిచొచ్చే అంశంగా చెప్పొచ్చు. ఇటీవల నియోజకవర్గాన్ని అంటి పెట్టుకొని తిరుగుతున్న రాయల నాగేశ్వరరావు, మద్ది శ్రీనివాస్ రెడ్డి, మాదవిరెడ్డి  కాంగ్రెస్ అభ్యర్థిగా ఉంటారా లేక మరో అభ్యర్థిని దిగుమతి చేసుకుంటారో వేసి చూడాల్చిందే. ఇక దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి కుమార్తె, వైఎస్ ఆర్ టిపి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాలేరు నియోజకవర్గంలో పోటీ చేస్తానంటూ ప్రకటించి క్యాంపు కార్యాలయం కూడా ప్రారంభించారు.

ఇది కూడా చదవండి: ఖమ్మం మిర్చి మార్కెట్ లో ఘర్షణ

వైఎస్ఆర్ అభిమానులు, కాంగ్రెస్ క్రాస్ ఓటింగ్ పైనే ఆశలు పెట్టుకున్న షర్మిల బంగపడక తప్పదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పాలేరు నియోజకవర్గంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అభ్యర్థులు ఎవరైనా అనూహ్య మార్పులు సంభవిస్తే తప్ప ప్రస్తుతం కందాళ ఉపేందర్ రెడ్డి కి ప్రజల్లో కొంత వ్యతిరేకత తగ్గిందని ప్రజలు చెబుతున్నారు. అదే కందాళ కు ప్లస్ గా మారింది.