నూతన కలెక్టరేట్ భవననిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి- మంత్రి పువ్వాడ.
*▪️వివి పాలెం వద్ద నిర్మాణంలో ఉన్న కలెక్టరేట్ భావన సముదాయం.*
నూతన కలెక్టరేట్ భవననిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలి- మంత్రి పువ్వాడ.
*▪️వివి పాలెం వద్ద నిర్మాణంలో ఉన్న కలెక్టరేట్ భావన సముదాయం.*
*▪️44 కోట్ల వ్యయంతో 1.69 లక్షల చ.అడుగుల భవనం.*
*▪️పరిపాలనా సౌలభ్యం కోసం అన్ని జిల్లా కార్యాలయాలు ఇక్కడే..*
(పెండ్లి అంజయ్య)
(ఖమ్మం ప్రతినిధి-విజయం న్యూస్)
ప్రజలకు అన్ని సేవలు ఒకే దగ్గర ఉండాలని, పరిపాలన సౌలభ్యం కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న నూతన కలెక్టరేట్ భవనం దాదాపు పూర్తి కావచ్చింది.నిర్మాణంలో ఉన్న భవనంను జిల్లా కలెక్టర్ విపి గౌతం గారితో కలిసి వివి.పాలెం గ్రామ సమీపంలో నిర్మితమవుతున్న నూతన కలెక్టరేట్ కార్యాలయ భవన సముదాయ నిర్మాణ పనుల పురోగతిని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరిశీలించారు.
Allso read:- కాళోజీ చిత్రపటానికి నివాళ్ళు అర్పించిన మంత్రి పువ్వాడ
భవన నిర్మాణం, ప్రాంగణానికి సంబందించిన ప్లాన్ ను పరిశీలించారు. ప్లాన్ ప్రకారంగా ఆయా పనులను కొనసాగుతున్నాయా లేదా అని పరిశీలించారు. నూతన కలెక్టరేట్ భవన నిర్మాణాన్ని ప్రభుత్వం అత్యంత ప్రతష్టాత్మకంగా తీసుకుందని, రూ.44కోట్లతో 1,69,000 చ.అ.విస్తీర్ణంలో చేపడుతున్నట్లు చెప్పారు.
ఆయా పనుల పురోగతి వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే మెయిన్ బిల్డింగ్ స్లాబ్లు నిర్మాణం, అంతర్గత సివిల్ పనులు పూర్తి అయ్యాయని ఫినిషింగ్ పనులు జరుగుతున్నాయని అధికారులు వివరించారు.
పలు గదులు ఇప్పటికే ఫ్లోరింగ్ పనులు సైతం పూర్తి అయ్యాయని పేర్కొన్నారు. భవనం మొత్తం తిరిగి విద్యుత్ పనులు, ప్యాన్ల ఏర్పాటు, డ్రైనేజీ, నీటి సరఫరా, పార్కింగ్, టైల్స్ పనులు వివరాలను అధికారులను అడిగి తెలసుకున్నారు.
Allso read:- సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా కూనంనేని సాంబశివరావు ఎన్నిక.
ఫర్నీచర్, విద్యుత్, లైటింగ్, ఫ్లోరింగ్ తదితర పనులు వేగం పెంచాలని సూచించారు.
భవన ప్రాంగణం ముందు భాగం మొత్తం చదును చేయాలని, చదును చేసిన అనంతరం నడక దారికి వీడీఎఫ్ రోడ్స్ ను వేయాలన్నారు. దీనితో పాటు కాంపౌండ్ వాల్ చేపట్టాలని సూచించారు. భవన సముదాయం వెనక భాగంలో వీడీఎఫ్ రోడ్డు వేయాలని సూచించారు. అనంతరం పాత్ వే పనులను పరిశీలించారు.
భవన సముదాయం మధ్యలో చేపట్టవల్సిన ప్లాంటింగ్, లాన్ పనులను సుందరంగా కనబడేట్లు చేపట్టాలన్నారు. వాహనాల పార్కింగ్, ఇతర పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
పూర్తవుతున్న పనుల వివరాల నివేదికను అందివ్వాలన్నారు. ఇప్పటికీ చాలా ఆలస్యం జరిగిందని, పనులు చాలా ఆలస్యంగా జరుగుతున్నాయని, అదనపు కార్మికులను కేటాయించి పనుల వేగం పెంచాలని అదేశించారు.
ఈ కార్యక్రమంలో రోడ్లు, భవనాల శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్యాoప్రసాద్, తదితర అధికారులు ఉన్నారు.