జిల్లాకు నిదులోచ్చినయ్
== ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడిన సీఎం
== జిల్లా అభివృద్ధికి రూ.248కోట్లు మంజూరు చేసిన కేసీఅర్.
== ఫలించిన మంత్రి పువ్వాడ కృషి.
== జీవో వెచ్చే వరకు నిర్విరామ కృషి చేసిన మంత్రి పువ్వాడ.
== మంత్రి పువ్వాడకు కృతజ్ఞతలు తెలిపిన జిల్లా ప్రజలు..
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
సీఎం కేసీఆర్ మాటంటే మాటే..? గతంలో హామీల సంగతేమో..? కానీ.. ఇటీవలే బీఆర్ఎస్ పార్టీ అవిర్భవ సభకు ఖమ్మం వచ్చిన సీఎం కేసీఆర్, వేదిక సాక్షిగా, సభ సాక్షిగా ఖమ్మం ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి జిల్లా అభివృద్దికి బడ్జెట్ కేటాయించారు. ఖమ్మంలోని బీఆర్ఎస్ అవిర్భావ సభలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తూ జిల్లా ప్రజల సంక్షేమాభివృద్దిని దృష్టిలో పెట్టుకుని, గ్రామ పంచాయతీలు, పట్టణాలు, పలెల్లు, మున్సిపాలటీల అభివృద్ది చేసేందుకు ప్రత్యేకంగా సీఎం పండ్స్ నుంచి నిధులు మంజూరు చేస్తానని హామినిచ్చారు. జిల్లాలోని ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ కు రూ. 50 కోట్లు, ఒక్కో మున్సిపాలిటీలకు రూ.30 కోట్లు, ప్రతి గ్రామ పంచాయతీకి రూ.10లక్షలు, మేజర్ గ్రామ పంచాయతీలకు రూ.10 కోట్లు చొప్పున మొత్తం రూ.248కోట్లను మంజూరు చేస్తానని హామినిచ్చారు. ప్రకటన చేసి నెల రోజులు పూర్తి కాకముందే సీఎం కేసీఆర్ అనుకున్నమాటకు కట్టుబడి నిధులు మంజూరు చేశారు. ఈ నిధులు మంజూరు కోసం రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఎనలేని కృషి చేశారు.
ఇదికూడా చదవండి: నెల్లిపాక సోసైటీలో సీఈఓ సస్పెండ్
అందుకు గాను సర్పంచులు, కార్పోరేటర్లు, కౌన్సిలర్లు, అధికారులు సీఎం కేసీఆర్ కు, మంత్రి పువ్వాడ అజయ్ కు ధన్యవాదాలు, కృతజ్జతలు తెలిపారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే ఖమ్మం జిల్లా సమగ్రాభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఅర్ ఇచ్చిన వాగ్ధానం మేరకు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్(ఎస్డీఎఫ్) రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. జిల్లా అభివృద్ధి కి నిధులు మంజూరు చేయాలని అనేక మార్లు ముఖ్యమంత్రి కేసీఅర్ గారు దృష్టి కి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తీసుకెళ్లారు. అనేక ప్రభుత్వాలు వచ్చిన పాలకులు కేవలం రాజకీయ అవసరాలకు వాడుకున్నారే తప్ప జిల్లా అభివృద్ధికి ఏనాడూ నిధులు మంజూరు చేయలేకపోయారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం నగరాభివృద్ధి తరహాలో జిల్లాను చూడాలనే ఆకాంక్షతో జిల్లాకు నిధులు ఇవ్వాలని అనేక మార్లు కేసీఅర్ గారిని వినతి పత్రాలు అందించారు. స్పందించిన కేసీఅర్ గారు జిల్లాకు రూ.248 కోట్లు మంజూరు చేశారు. ఆయా నిధులకు సంబందించి జీవోను ఇచ్చే వరకు వెంటపడి మరీ జీవో ను వచ్చేలా చేశారు.
ఇదికూడా చదవండి: ఇస్త్రీ పట్టి..కార్మికుడైన మంత్రి పువ్వాడ
జిల్లాలోని ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ కు రూ. 50 కోట్లు, అన్ని సత్తుపల్లి, వైరా, మధిర ఒక్కో మున్సిపాలిటీలకు రూ.30 కోట్లు చొప్పున మొత్తం రూ 90 కోట్లు, ప్రతి గ్రామ పంచాయతీకి రూ.10లక్షల చొప్పున 584 గ్రామ పంచాయతీలకు గాను రూ.58.40 కోట్లు, పెద్దతండా, ఎదులాపురం, కల్లూరు, తల్లాడ, నేలకొండపల్లి గ్రామ పంచాయతీలకు రూ.10 కోట్లు చొప్పున మొత్తం రూ.50 కొట్లు మొత్తం జిల్లాకు గాను రూ.248.40 కోట్ల నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులను జారీ చేసింది. జనవరి 18వ తేదిన ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ప్రారంభోత్సవంకు విచ్చేసిన ముఖ్యమంత్రి కేసీఅర్ గారు ఖమ్మం జిల్లా అభివృద్ధి కోసం చేసిన వాగ్దానంను నేడు ఆచరణలో చేసి చూపారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అభ్యర్థన మేరకు ఆయా నిధులను ముఖ్యమంత్రి కేసీఅర్ పరిగణనలోకి తీసుకుని కేసీఅర్ ప్రకటించారు. ఇచ్చిన వాగ్ధానం మేరకు ఆయా నిధులను నేడు గురువారం ఉత్తర్వులను వెలువడించింది. ఇందుకుగాను తక్షణమే తదుపరి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు ఇచ్చారు.అభివృధి నిధులు విడుదల పట్ల జిల్లా ప్రజాప్రతినిధులు, నాయకులు, ప్రజలు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కి కృతజ్ఞతలు తెలిపారు.
ఇదికూడా చదవండిం కార్పొరేట్ కు దీటుగా సర్కార్ స్కూళ్ల అభివృద్ధి:మంత్రి