16న ఈడీ ముందుకు కవిత
== ముగిసిన ఎమ్మెల్సీ కవిత ఇడి విచారణ
== తిరిగి 16న మరోమారు విచారణకు రావాలని ఆదేశాలు
== దాదాపు ఎనిమిదిన్నర గంటలపాటు విచారణ
== పిళ్లై తదితరుల సమాచారం మేరకు ప్రశ్నల పరంపర
== లిక్కర్ స్కామ్తో సంబంధం లేదని స్పష్టం చేసిన కవిత?
== విచారణ అనంతరం నేరుగా కెసిఆర్ నివాసానికి పయనం
== కవితకు మద్దతుగా ఢల్లీిలోనే మకాం వేసిన మంత్రులు, బిఆర్ఎస్ నేతలు
న్యూఢల్లీ,మార్చి11(విజయంన్యూస్):
దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించిన ఢల్లీి లిక్కర్ స్కామ్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ విచారణ ముగిసింది. ఈ నెల 16న మళ్లీ విచారణకు రావాలని కవితకు నోటీసులిచ్చినట్లు సమాచారం. సాయంత్రం 5.30 గంటలకే విచారణ ముగియాల్సి ఉండగా.. అనూహ్యంగా ఆ సమయాన్ని పెంచారు. రూల్ ప్రకారం మహిళలను సాయంత్రం 6 వరకు మాత్రమే విచారించాల్సి ఉన్నా, సమయం దాటినా కవితను ఈడీ బయటకు పంపలేదు. ఈడీ వైఖరితో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలో పడ్డాయి. అయితే..
ఇదికూడా చదవండి: ఈడి విచారణకు హాజరైన ఎమ్మెల్సీ కవిత
కవిత బయటికి రాగానే.. బీఆర్ఎస్ శ్రేణులు హ్యాపీగా ఫీలయ్యి ఈలలు, కేకలు, నినాదాలతో హోరెత్తించాయి. ఎమ్మెల్సీ కవిత ఈడీ విచారణ ముగియడంతో ఆనందంవ్యక్తం చేశారు. దాదాపు 8:30 గంటల పాటు కవితను ఈడీ అధికారులు విచారించారు. విచారణ ముగిసిన అనంతరం తుగ్లక్ రోడ్డులోని కేసీఆర్ నివాసానికి కవిత బయల్దేరారు. అయితే ఈడీ ఆఫీసు నుంచి కవిత బయటకు రాగానే ఆమె మద్దతుదారులు జై బీఆర్ఎస్.. జై కవితక్క అంటూ నినదించారు. ఇదిలా ఉంటే.. ఈడీ ఆఫీసు దగ్గర పోలీసులు హై అలర్ట్ ప్రకటించడం, విూడియాను, బీఆర్ఎస్ కేడర్ను ఈడీ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో లేకుండా పోలీసులు దూరంగా పంపారు. దీంతో.. కవిత బయటికి రాగానే అరెస్ట్ చేస్తారని ఢల్లీిలో వార్తలు చక్కర్లు కొట్టాయి. కార్యాలయం దగ్గర వాతావరణాన్ని చూసిన బీఆర్ఎస్ కార్యకర్తలు, మంత్రులు ఒకింత టెన్షన్ పడ్డారు. ఇకపోతే ఏం విచారించారన్న దానిపైనే ఇప్పుడు అందరూ అంచనా వేస్తున్నారు. ఢల్లీి మద్యం పాలసీలో మార్పులు, ఈ మార్పులు చేర్పులు వెనుక ఎవరెవరి పాత్ర ఉంది.. మనీష్ సిసోడియాతో (ఓజీనితిబఠ ªూతిబనీటతిజీ) పరిచయం ఎలా ఏర్పడిరది..!? ఢల్లీి గవర్నమెంట్కు సౌత్గ్రూప్నకు మధ్యవర్తి విూరేనా.. వంటి ప్రశ్నలతో సమాధానాలు రాబట్టారని సమాచారం.
ఇది కూడా చదవండి: తిరుమల ఘాట్ రోడ్డులో ప్రమాదం
ఢల్లీి మద్యం వ్యాపారంతో విూకున్న సంబంధం, లిక్కర్ స్కామ్లో విూ పాత్ర ఉందా.. లేదా., అరుణ్ రామచంద్ర పిల్ళై విూకు బినావిూనా కాదా..?, విూ ప్రతినిధని పిల్ళై చెప్పిన దాంట్లో నిజమెంత..? అతనితో ఆర్థిక లావాదేవీలు ఏమైనా జరిగాయా..?,రామచంద్రతో వ్యాపారం చేస్తే నాతో చేసినట్లే అని విూరు చెప్పలేదా..?, సౌత్గ్రూప్ తో విూకున్న సంబంధాలేంటి..?.. ఛార్టెడ్ ఫ్లైట్లో వెళ్లి రూ. 130 కోట్లు లంచం ఇచ్చారా..? 30 కోట్లు డబ్బు ఎక్కడ్నుంచి వచ్చింది.. ఎవరిచ్చారు..?, ఫ్లైట్ను ఎవరు సమకూర్చారు..?, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ఎప్పుడైనా కలిశారా.. వంటి ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారని అంటున్నారు. ఫేస్టైమ్లో విూరు సవిూర్ మహేంద్రుతో మాట్లాడారా.. లేదా..? శరత్ చంద్రారెడ్డిని ఎన్నిసార్లు కలిశారు..? శరత్ చంద్రాతో తరుచూ మాట్లాడాల్సిన అవసరం ఏంటి..? ఆధారాలు మాయం చేసేందుకు సెల్ఫోన్లు ధ్వంసం చేశారా..?. సెల్ఫోన్లు ఎందుకు ధ్వంసం చేశారు..? . గోరంట్ల బుచ్చిబాబుకు విూకున్న సంబంధ మేంటి..?ఈ ప్రశ్నలతో పాటు వీటితో ముడిపడిన పలు అనుబంధ ప్రశ్నలను సంబంధిత వివరాలను కవితను ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రధానంగా శనివారం జరిగిన విచారణ మొత్తంలో కవిత
ఇదికూడా చదవండి: నేలకొండపల్లి మండల కేంద్రంలో బండి సంజయ్ దిష్టిబొమ్మ దగ్దం
మొబైల్ ఫోన్లు ధ్వంసం చేస్తున్నట్లు వచ్చిన ఆరోపణలు, స్కామ్లో సౌత్ గ్రూప్ పాత్రపై విచారించారని సమాచారం. అంతేకాకుండా అరుణ్ పిª`లళై రిమాండ్ రిపోర్ట్ ఆధారంగా కవితపై ప్రశ్నల వర్షం కురిపిం చారని తెలుస్తోంది. మాజీ ఆడిటర్ బుచ్చిబాబు వాట్సాప్ చాట్ ఆధారంగా కూడా ప్రశ్నలు అడిగారని సమాచారం. కవిత`పిల్ళై ఇద్దర్నీ కాన్ఫ్రాంటేషన్ ఇంటరాగేషన్ ద్వారా అధికారులు విచారించారని తెలుస్తోంది. కవితతో పాటు మొత్తం 9 మందిని ఈడీ అధికారులు ప్రశ్నించినట్లు తెలుస్తోంది. మనీష్ సిసోడియా, కవిత, అరుణ్ రామచంద్రన్ పిళ్ళై, దినేష్ అరోరా, బుచ్చిబాబు, సిసోడియా మాజీ కార్యదర్శి అరవింద్, ఎక్సైజ్ శాఖ మాజీ అధికారులు కుల్దీప్ సింగ్, నరేంద్ర సింగ్లను విడివిడిగా, కలిపి ఈడీ ప్రశ్నించినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మొత్తంగా కవితను అనేక ప్రశ్నలు అడగడం ద్వారా ఆమె చెప్పిన సమాధానాలు రికార్డు చేశారు. సౌత్ గ్రూప్ ద్వారా 100 కోట్ల రూపాయల ముడుపులను ఆప్ పార్టీకి ఇచ్చినట్లు సిసోడియా, పిళ్లయ్, బుచ్చిబాబు, మాగుంట రాఘవరెడ్డిలు ఇచ్చిన సమాచారం ఆధారంగా కవితను ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: కూసుమంచిలో బండిసంజయ్ దిష్టిబొమ్మ దగ్ధం..
ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ సెక్షన్ 50 కింద కవిత స్టేటమేంట్ రికార్డ్ చేశారు. విచారణ సందర్భంగా లిక్కర్ స్కాం గురించి నాకేం తెలియదని.. నేను కుట్రదారుని కాదు అని స్పష్టం చేశారని అన్నట్లు తెలుస్తోంది. ఎలాంటి ఆధారాలు ధ్వంసం చేయలేదంటూ ఈడీ ప్రశ్నలకు సమాధానం ఇచ్చారని అంటున్నారు. కవితను ప్రశ్నించే సమయంలో.. అరుణ్ పిళ్లయ్ కూడా అక్కడే ఉన్నారు. గత విచారణలో కవిత బినావిూ అంటూ ఆయన ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా.. రిమాండ్ రిపోర్టులో కవిత పేరును ప్రస్తావించారు. ఆ తర్వాత తన స్టేట్ మెంట్ ఉప సంహరించుకుంటు న్నట్లు పిళ్లయ్ రిట్ పిటీషన్ దాఖలు చేశారు. ఇప్పుడు. ఆయన సమక్షంలోనే కవితను ఇంటరాగేషన్ చేయటం విశేషం. ఇకపోతే కవిత ధర్నా కోసం 9ననే ఢల్లీికి చేరుకున్నారు. 10న ధర్నా చేపట్టిన తరవాత 11న హాజరువతానని చెప్పి హాజరయ్యారు. ఆమెకు అండగా మంత్రులు,ఎంపిలు, ఎమ్మెల్యేలు, లీగల్ టీమ్ ఢల్లీిలోనే మకాం వేసింది. మంత్రి కెటిఆర్, హరీష్ రావులు ముందుగానే కవితతో చర్చించి ప్రిపేర్ చేసి విచారణకు పంపారని తెలుస్తోంది. దేనికైనా ధైర్యంగా సమాధానం చెప్పాలని సూచించారని సమాచారం. మొత్తంగా తొలిరోజు విచారణ తరవాత ఇక 16న మరోమారు విచారణలో మరిన్ని విషయాలు రాబట్టే అవకాశం ఉంది.
ఇదికూడా చదవండి: బండిసంజయ్ పై బీఆర్ఎస్ ఫైర్