కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ పై టీఆర్ఎస్ ఎంపీల ప్రివిలేజ్ మోషన్
తెలంగాణ విజయం న్యూస్
కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్ పై టీఆర్ఎస్ ఎంపీల ప్రివిలేజ్ మోషన్
(తెలంగాణ విజయం న్యూస్):–
పార్లమెంటరీ నిబంధనలు, లోక్ సభ రూల్ నెంబర్ 222 ప్రకారం ఆయన సభకు పచ్చి అబద్ధాలు చెప్పారని టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కే. కేశవరావు, లోక్సభ సభా పక్ష నేత నామ నాగేశ్వరరావు ఆక్షేపణఆయనపై ప్రివిలేజ్ మోషన్ కింద చర్యలు తీసుకోవాలని లోక్సభ స్పీకర్ ఓంబిర్లాకు విజ్ఞప్తి
also read :-మానవాళి మనుగడ చెట్లతో ముడిపడి ఉంది- మంత్రి పువ్వాడ.
రాష్ట్ర ప్రభుత్వానికి గిరిజన సంక్షేమంపై ఉన్న చిత్తశుద్ధిని అపహాస్యం చేసే విధంగా ప్రవర్తించి సభను తప్పు తొవ పట్టించడంపై నిలదీతగరిజనుల రిజర్వేషన్ల పెంపుపై రాష్ట్ర ప్రభుత్వం నుండి ఎలాంటి ప్రతిపాదనలు అందలేదని అనడం… భారత పార్లమెంటరీ వ్యవస్థను అవమానించినట్టేస్పీకర్, తెలంగాణ అసెంబ్లీ, కేంద్ర మంత్రిత్వ శాఖ మధ్య ఇంత చర్చ జరిగిన అంశంపై అబద్ధం చెప్పడాన్ని రాజ్యాంగ వ్యవస్థ తీవ్ర అవమానించినట్టు చూడాలి.
also read :-గిరిజన బిల్లు ప్రవేశపెట్టనందుకు నిరసన.. దిష్టి బొమ్మ దహనం..
లోక్సభలో ఆయన స్పందన తెలంగాణ రాష్ట్ర గిరిజనుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంది.తెలంగాణ వచ్చిన తొలి నాళ్లలోనే గిరిజనుల రిజర్వేషన్ల బిల్లును అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపిన విషయం నిజం కాదా?గిరిజనుల రిజర్వేషన్ల పెంపుపై స్వయంగా సీఎం కేసీఆర్ ప్రధానమంత్రికి రాత పూర్వకంగా ఇచ్చిన విషయాన్ని విస్మరించడం దారుణం
గతంలో కేంద్ర గిరిజన మంత్రిత్వ శాఖ డిప్యూటీ సెక్రటరీ దిలీప్ కుమార్ కూడా తెలంగాణ రాష్ట్రంలో 9.08 కంటే తగ్గకుండా గిరిజనులకు రిజర్వేషన్ పెంచాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు రాయడం నిజం కాదా? అని ఎంపీ నామ ప్రశ్నించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా 2018, 2019లో ప్రధాని మోదీని కలిసి రాసిన లేఖను ఇచ్చారు. తెలంగాణ గిరిజన శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ గారు కూడా పలుమార్లు కేంద్రానికి లేఖ రాశారు.ఇది రాజ్యాంగపరంగా మా హక్కుని సవివరంగా చెప్పడం జరిగింది. ఈ బిల్లును ఆమోదించేలా చూడాలని కోరడం జరిగింది.ఇవన్నీ చేశాక, అసలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రతిపాదన లేదని అనడం విడ్డూరం.పార్లమెంట్లో అబద్దాలు చెప్పడం చరిత్రలో ఏ కేంద్ర ప్రభుత్వం చేయలేదు.