Telugu News

పీఆర్సీ జీవోలపై ఉద్యోగ సంఘాల ఆగ్రహం

జీవో కాపీలను దగ్ధం చేసి నిరసనలు

0

పీఆర్సీ జీవోలపై ఉద్యోగ సంఘాల ఆగ్రహం
జీవో కాపీలను దగ్ధం చేసి నిరసనలు
 ప్రభుత్వ తీరుపై మండిపడ్డ నేతలు
 నేటినుంచి ఆందోళనలకు పిలుపు
(అమరావతి-విజయంన్యూస్)
అమరావతి ఏపీలో ఉద్యోగులు, ప్రభుత్వం మధ్య యుద్ధం ప్రారంభమైంది. ఉద్యోగుల ఆందోళనను కౌంటర్‌ చేస్తూ నేరుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులను ప్రభుత్వం రంగంలోకి దించింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇతర అధికారుల ప్రకటనపై ఉద్యోగ సంఘాలు మండిపడ్డాయి. ప్రభుత్వ వైఖరికి నిరసనగా జీఓ కాపీలను ఎన్‌జీఓ హోం ముందు దగ్ధం చేసి సవాలు విసిరాయి. ఉద్యోగుల జీతాలు తగ్గవంటూ అధికారుల ప్రకటన చేశారు.

also read :-పచ్చదనం పెంచటంలో ప్రతీ ఒక్కరిదీ బాధ్యతే : వనజీవి రామయ్య

రాష్ట్ర ఆదాయం పడిపోయిందని ఆర్ధికశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ స్పష్టం చేశారు. విభజన, కరోనా వల్ల ఆదాయం తగ్గిపోయిందని అధికారులు అంటున్నారు. విశాల దృక్పథంతో ఉద్యోగులు వ్యవహరించాలని ప్రధాన కార్యదర్శి విజ్ఞప్తి చేశారు. ఈ ప్రకటనపై ఉద్యోగ సంఘాలు మండిపడ్డాయి. విశాల దృక్పథం వల్లే రెండున్నర సంవత్సరాలు పీఆర్‌సీ కోసం ఓపికపట్టామని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. జీతం ఎలా తగ్గుతుందో లెక్కలేసి మరీ బొప్పరాజు చెప్పారు. రాష్ట్ర ఆదాయం పెరిగిందని కాగ్‌ నివేదిక, విజయ్‌సాయి రెడ్డి ట్వీట్‌ను ఉద్యోగ సంఘాల నేతలు చూపించారు. ఫిట్‌మెంట్‌ , హెచ్‌ఆర్‌ఏలో కోత విధిస్తే జీతం తగ్గదా అని ప్రశ్నించారు. మాటలు లేవు, చర్చలు లేవు ఆందోళనకే సై అని బండి శ్రీనివాసరావు తెలిపారు.

21వ తేదీన సమ్మె నోటీసు ఇస్తామని సవాల్‌ విసిరారు. మొత్తంగా ఏపీలో పీఆర్సీ రగడ తీవ్ర రూపం దాల్చింది. పీఆర్సీ జీవోల పై భగ్గు మంటున్న ఉద్యోగ సంఘాలు ఉద్యమ కార్యాచరణకు సిద్దం అవుతున్నాయి. ఈ మేరకు జివోల కాపీలను దగ్ధం చేసి ప్రభుత్వానికి వ్యతరేకంగా నినాదాలు చేశారు. పీఆర్సీ జీవో కాపీలను ఏపీఎన్జీవో సంఘం నేతలు దగ్దం చేశాయి. జీతాల కోతను అంగీకరించేది లేదంటున్నారు. ఏపీ ఎన్జీవో మహిళా ఉద్యోగులు ఈ రివర్స్‌ పీఆర్సీ మాకు వద్దు అన్నారు. ప్రభుత్వంపై ఉద్యోగ సంఘాల నేతలు మండిపడుతున్నారు. జీవోలు రద్దు చేసే వరకు ప్రభుత్వంతో చర్చలకు వెళ్ళే ప్రసక్తే లేదన్నారు. మా డీఏలు మాకు ఇచ్చి జీతంలో సర్దుబాటు చేయడం ఉద్యోగులనుమోసం చేయడమే అన్నారు.

also read :-జూలూరుపాడు మండలం నుండి కాంగ్రెస్ పార్టీలో చేరికలు

10 వేల కోట్ల రూపాయల అదనపు భారం పడుతుందని సీఎస్‌ చెప్పిన లెక్కలన్నీ బోగస్‌ అని విమర్శించారు. కేంద్ర పే స్కేలును అమలు చేసే హక్కు ప్రభుత్వానికి లేదు. మా అంగీకారం లేకుండా ప్రభుత్వం నిర్ణయం ఎలా తీసుకుంటుందనిబొప్పరాజు వెంకటేశ్వర్లు అన్నారు.. ఇదిలా వుంటే డీఏలను కలుపుకుని జీతం లెక్క పెట్టడం కరెక్ట్‌ కాదు. ఇంటి అª`దదె లు పెరుగుతుంటే ప్రభుత్వం హెచ్‌ఆర్‌ఏ తగ్గించటం ఏంటి? మేము రోడ్ల విూద గుడిసెలు వేసుకుని ఉండాలని ప్రభుత్వం భావిస్తోందా? చర్చల సమయంలో హెచ్‌ఆర్‌ఏ తగ్గిస్తాం, సీసీఏ రద్దు చేస్తాం అనే విషయాలు చెప్పలేదన్నారు ఉద్యోగ సంఘాల నేతలు. గురువారం ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ల ముట్టడి జరగనుంది. ప్రభుత్వం ఇచ్చిన జివో లను రద్దు చేయాలని కోరుతూ ఫ్యాఫ్టో జిల్లా కలెక్టరేట్‌ల ముట్టడికి పిలుపు నిచ్చింది. ఈ కార్యక్రమానికి మద్దతు ప్రకటించింది జేఏసీల ఐక్యవేదిక. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉద్యోగ సంఘాల నేతలు బండి శ్రీనివాసరావు, బొప్పరాజు వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు.