రాష్ట్రంలో రేపటి నుంచి వడగండ్ల వర్షాలు.
== మూడురోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందన్న వాతావరణం శాఖ
== భయపడుతున్న రైతులు
(హైదరాబాద్-విజయం న్యూస్) :
ఒక వైపు దంచికొడుతున్న ఎండలు.. మరోవైపు వడగాలులు..ఈ సమయంలో వాతావరణ శాఖ మరో కబురు చెప్పింది. ఈ కబురు రైతుల గుండేల్లో రైళ్ళు పరుగెడుతున్నాయి.. ఎందుకంటే ప్రస్తుతం వరి కోతలు ముమ్మరంగా కొనసాగుతుండగా, మరో వైపు మిర్చి కోతలు నడుస్తున్నాయి..ఇంకో వైపు మామిడి కాత చెట్టుపైన ఉంది.. ఈ క్రమంలో వడ గాలులు, వడగండ్ల వర్షాలు కురిస్తే రైతులు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది.. అందుకే రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పూర్తి వివరాలు చూస్తే
ఇది కూడా చదవండి:- జిల్లాలో ‘చడ్డీ గ్యాంగ్’ తిరుగుతోంది: తాతామధు
మార్చి మధ్యలోనే ఎండలు దంచికొడుతున్నాయి. మరీ ముఖ్యంగా మధ్యాహ్నం పూట అడుగు బయటపెట్టాలంటే భయపడే పరిస్థితి ఉంది. అయితే ఇలా ఉన్న వాతావరణంలో ఒక్కసారిగా మార్పు రానుంది. రాష్ట్రంలో బుధవారం నుంచి వాతావరణం పూర్తిగా మారనుంది. బుధవారం నుంచి నాలుగు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.తూర్పు, ఆగ్నేయ దిశల నుంచి రాష్ట్రంలో పశ్చిమ దిశగా వీస్తున్న గాలుల ద్రోణి సోమవారం బలపడడంతో..
ఇది కూడా చదవండి:- కేసీఅర్ నీ గద్దె దింపే దమ్ము నీకుందా: మంత్రి పువ్వాడ
గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. అయితే ఓవైపు వర్షంతో పాటు పలు జిల్లాల్లో 36 నుంచి 40 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలూ ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 16, 17 తేదీల్లో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వడగండ్ల వాన, 17న ఉత్తర, పశ్చిమ, ఈశాన్య జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది.
ఇది కూడా చదవండి:- ఖమ్మంలో కుక్కల దాడికి బాలుడు మృతి
👉గురువారం ఆదిలాబాద్, కుమ్రంభీం, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, కామారెడ్డి, సిరిసిల్ల, వరంగల్, హన్మకొండ, మహబూబాబాద్, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాల్లో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
👉శుక్రవారం ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, కామారెడ్డి జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయి.
ఇది కూడా చదవండి:- అధికారం ఎవడబ్బా సొత్తుకాదు: పొంగులేటి
👉శనివారం ఆదిలాబాద్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, కుమ్రంభీం, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, వరంగల్, హన్మకొండ, కామారెడ్డి, ములుగు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వడగండ్ల వాన కురిసే అవకాశం ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో మూడు రోజుల పాటు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.