జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలపై రేగ హామీ
== కొత్తగూడెంలో ఇళ్ల స్థలాల కేటాయింపుకు కృషి
== ప్రభుత్వ విప్ రేగా కాంతారావును కలిసిన భద్రాచలం జర్నలిస్ట్ జేఏసీ ప్రతినిధులు
== ఏజెన్సీ జర్నలిస్టులకు న్యాయం చేయాలని వినతి
(భద్రాచలం-విజయంన్యూస్):
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు చర్యలు చేపడతానని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగ కాంతారావు భరోసా ఇచ్చారు. భద్రాచలం జర్నలిస్టు జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) ఆధ్వర్యంలో శనివారం పినపాక నియోజకవర్గం కరకగూడెం గ్రామంలో ప్రభుత్వ విప్ రేగా కాంతారావుని కలిసి జర్నలిస్టుల స్థలాలకు సంబంధించిన సమస్యపై చర్చించి, వినతి పత్రం అందజేశారు.9.11.22 న సీఎంవో నుంచి ప్రభుత్వ విప్ రేగా కాంతారావు తీసుకొచ్చిన…143 సర్క్యులర్ అనుసరించి… కొత్తగూడెం 143 సర్వేలో జిల్లాలోని జర్నలిస్టులకు కేటాయించిన ఇళ్ల స్థలాల ప్రక్రియను వేగతరం చేసి… జిల్లావ్యాప్తంగా పనిచేస్తున్న అన్ని మండల విలేకరులకు ఇళ్ల స్థలాలు వచ్చేలా తమరు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకు సానుకూలంగా స్పందించిన రేగ… ఇందుకు సంబంధించి జిల్లా కలెక్టర్ తో మాట్లాడి… జర్నలిస్టులందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.అవసరమైతే ఈ విషయం… మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. ప్రభుత్వ విప్ రేగాని కలిసిన వారిలో… భద్రాచలం జర్నలిస్టు జేఏసీ ప్రతినిధులు మొబగాపు ఆనంద్ కుమార్, తోటమల్ల బాలయోగి, కర్రా అనిల్ రెడ్డి, కాటా సత్యం, పూనెం ప్రదీప్, డి. రవికుమార్, గండేబోయిన వెంకటేశ్వర్లు, సాయి సంపత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి: ఏసీబీ చిక్కిన హెచ్ఎం ఎం శ్రీలత