గడుర బస్సుకు ఎగిసిపడుతున్న మంటలు
బస్సు దిగి పరుగులు తీసిన ప్రయాణికులు
తప్పిన పెద్ద ప్రమాదం
(వైరా –విజయం న్యూస్)
గరుడ బస్సులో ఉన్నట్టుండి మంటలు ఎగిసిపడ్డాయి.. బస్సు వెనక వైపున మంటలు అలుముకోవడంతో ప్రయాణికులు పెద్ద ఎత్తున కేకలు వేశారు.. దీంతో డ్రైవర్ బస్సును అక్కడే ఉన్నపళంగా నిలిపివేయడంతో ప్రయాణికులు దిగి పరుగులు తీశారు.. దీంతో పెద్ద ప్రమాదం తప్పింది.. మియాపూర్ to భద్రాచలం వెళుతున్న గరుడ ప్లస్ బస్సు మార్గం మధ్యలోని వైరా ప్రభుత్వ ఉన్నత పాఠశాల సమీపంలో ఒకేసారి బస్సు నుంచి పొగలు రావడం, ఆ తరువాత మంటలు ఎగిసిపడటం జరిగింది. దీంతో బస్సులో ఉన్న ప్రయాణీకులు అందరూ బస్సు దిగారు. అందరు క్షేమంగా ఉండటంతో ఊపిరిపిల్చుకున్నారు. స్థానికులు పోలీసులకు, పైర్ కు సమాచారం ఇవ్వడంతో తక్షణమే అక్కడికి చేరుకున్న పైరింజన్ మంటలు అర్పుతోంది. వివరాలు తెలియాల్సి ఉంది.
*‘ఎప్పటికప్పుడు లెటెస్ట్ న్యూస్ కావాలనుకుంటున్నారా..? దేశంలో, రాష్ర్టంలో జరిగే తాజా బ్రేకింగ్ న్యూస్ కావాలనుకుంటున్నారా..? అయితే మా విజయం పేపర్ ను సబ్ స్కైబ్ చేసుకొండి.. మీ స్ర్కీన్ పై ఉన్న గంట గుర్తును నొక్కండి.. ఆ తరువాత ఎలో అని నొక్కండి.. మినిట్ టూ మినిట్ బ్రెకింగ్ న్యూస్ మీ ముంగిట’**