సాదు కుంటారో.. సంపుకుంటారా: మంత్రి పువ్వాడ
== ఈ అభివృద్ది ని ఏం చేసుకుంటరో మీ చేతుల్లోనే ఉంది..
== మీఅందరికి గ్యారెంటి కార్డ్ బీఆర్ఎస్ మాత్రమే
== రూ2.95 కోట్ల అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేసిన మంత్రి పువ్వాడ.
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
అత్యంత దుర్భరమైన పరిస్థితుల నుండి నేడు ఖమ్మం నగరం అభివృధ్దిలో ఇతర మున్సిపాలిటీలకు ఆదర్శంగా నిలిచిందని ఇంతటి అభివృద్ది సాధించిన బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, నన్ను సాదుకుంటారో.. సంపుకుంటారో మీ చేతుల్లోనే ఉందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. గురువారం ఖమ్మం నగరంలోని పలు డివిజన్లలో రూ.2.95 కోట్లతో చేపట్టనున్న పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేశారు. ఖమ్మం నగరం 19వ డివిజన్ నందు ఎస్డీఎఫ్ నిధులు రు.90 లక్షలతో నిర్మించనున్న సీసీ డ్రైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. 16వ డివిజన్ నందు ఎల్ఆర్ఎస్ నిధులు రూ.70 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్స్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఎల్ఆర్ఎస్ నిధులు రూ.50 లక్షలు సీసీ రోడ్స్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. 14వ డివిజన్ లో ఎల్ఆర్ఎస్ నిధులు రూ.85లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్స్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఒకప్పుడు ఖమ్మం నగరం మురికి కూపం లా ఉండేదని, సరైన రోడ్డు వ్యవస్థ, మురుగు వ్యవస్థ, త్రాగునీటి కొరత, అభివృద్ది ప్రణాళిక లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడిన ఘటనలు గుర్తు చేసుకోవాలన్నారు.
ఇది కూడా చదవండి: మహిళల కోసం నా సీటు త్యాగం చేస్తా: మంత్రి
ఎమ్మెల్యే గా గెలిచిన నాటి నుండి కేవలం ఖమ్మం అభివృద్దిపై ఒక ప్రణాళికతో, చిత్తశుద్దితో పని చేసి ఒక రుపుకు తీసుకొచ్చామని అన్నారు. నేడు మనం చూస్తున్న, అనుభవిస్తున్న అభివృద్ది ఎన్నో రోజుల కఠోర శ్రమ, కోట్ల రూపాయల నిధులు సమీరణ వల్లే సాధ్యమైందని పేర్కొన్నారు. ఖమ్మం నగరం నా ఇల్లు, ప్రజలంతా నా కుటుంబ సభ్యులు కాబట్టే నా ఇంటిని శుభ్రం చేసిన మాదిరిగా చెత్త సేకరణ, మురుగు తొలగింపు, రోడ్లు, డ్రైన్లు, ప్రతి రోజూ ఇంటింటికీ త్రాగునీరు సరఫర ఇలా అనేక పనులు చేపట్టి అభివృద్ది చేసుకున్నామని వివరించారు. అభివృద్ది విషయంలో నిబద్దత తో ఉన్నాం. ఖమ్మం నగరాభివృద్దిలో భాగంగా చెప్పిన అన్ని పనులు చేసినం.. కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి చెప్పనివి కూడా పూర్తి చేసినమని తెలిపారు. ఖమ్మం నగరానికి వచ్చినన్ని నిధులు ఏ మున్సిపల్ కార్పొరేషన్ కి రాలేదు.. అది కేవలం పురపాలక శాఖ మంత్రి కెటిఆర్ వల్లే సాధ్యమైందన్నారు. ఇంకా కావాల్సిన నిధులు కూడా తీసుకొచ్చి అభివృద్ది చేసి చూపిస్తాం. వచ్చే ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ పార్టీ ని గెలిపించాల్సిన బాధ్యత మీదే అన్నారు. ఈ నెల 30వ తేదీన ఖమ్మంకు మంత్రి కేటిఆర్ రానున్నారు. రూ.1200కోట్ల రూపాయల అభివృద్ది పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
== గ్యారెంటి కార్డ్ బీఆర్ఎస్ మాత్రమే
ఖమ్మం ఎవడో గ్యారెంటి కార్డ్ లు ఇస్తాం అంటారు.. దాన్ని నమ్ముకుంటే మనం మళ్ళీ పాత రోజులు చవిచూడాల్సి వస్తుంది.. మన గ్యారెంటి కార్డ్ బీఆర్ఎస్ మాత్రమే అని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. మనకి ఎవరి గ్యారెంటీ అక్కర్లేదు.. మనకు ఇప్పుడు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీ చాలు అని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిస్తే ఇంతకు రెండింతలు మరింత అభివృద్ది నగర ప్రజలు చూస్తారని వందల కోట్లు ప్రభుత్వం నుండి తీసుకువచ్చి అభివృద్ది చేసుకుందామని పేర్కొన్నారు.
== కొండా లక్ష్మణ్ బాపూజీకి మంత్రి పువ్వాడ ఘన నివాళులు..
మాజీ మంత్రి, స్వాతంత్ర్య సమర యోధుడు దివంగత కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని పురస్కరించుకుని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఘన నివాళులు అర్పించారు. గురువారం ఖమ్మం నగరం లకారం ట్యాంక్ బండ్ పై గల కొండ లక్ష్మణ బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. వారు మాట్లాడుతూ.. స్వాతంత్య్ర సమరయోధుడైన బాపూజీ తన జీవితాంతం ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడారని గుర్తు చేశారు.
ఇది కూడా చదవండి: కొందరి శిఖండి రాజకీయాలకు భయపడం: మంత్రి పువ్వాడ
బాపూజీ అందించిన నిస్వార్థ సేవలను మంత్రి పువ్వాడ స్మరించుకున్నారు. తొలి, మలిదశ ఉద్యమంలో పోరాడి ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. వారి పోరాట స్ఫూర్తితోనే కేసీఅర్ గారు తెలంగాణ ఉద్యమాన్ని ఉవ్వెత్తున తీసుకెళ్లి తెలంగాణ రాష్ట్రం ను సాధించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ విజయ్ కుమార్, డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, కార్పొరేటర్ లు చామకూరి వెంకన్న, మేడారపు వెంకటేశ్వర్లు, కురాకుల వలరాజ్, దండా జ్యోతి రెడ్డి, మున్సిపల్ ఎంఈ కృష్ణలాల్, పబ్లిక్ హెల్త్ ఈ ఈ రంజిత్, నాయకులు ఆర్జేసీ కృష్ణ, పగడాల నాగరాజు, దేవబక్తుని కిషోర్ బాబు, కొల్లు పద్మ, బిచ్చాల తిరుమలరావు, పరమెశ్, సంఘం నాయకులు చిలకమర్రి శ్రీనివాస్ బాబు, బెండెం జనార్ధన్, బండారు శ్రీనివాస్, సత్యనారాయణ, పిల్లలమర్రి కొండల రావు, సంపత్, మసురం శివరామకృష్ణ తదితరులు ఉన్నారు.
== అన్నదానం ప్రారంభించిన మంత్రి పువ్వాడ.
గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఖమ్మం నగరం 14వ డివిజన్ గొల్లగుడెం రోడ్ శ్రీ సద్గురు సాయి బాబా ఆలయ ప్రాంగణంలో ప్రతిష్టించిన గణేష్ మండపాన్ని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దర్శించుకున్నారు. సాయి బాబా ఆలయంలో బాబా ను దర్శించుకుని ఆశీర్వాదం అందుకున్నారు. అనంతరం ఎర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు.
ఇది కూడా చదవండి: ఖమ్మం ప్రజలు బీఆర్ఎస్ పై కరుణ చూపాలి: మంత్రి పువ్వాడ
ఖమ్మం నగరం ఎన్ఎస్టీ రోడ్ నందు శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ అధ్వర్యంలో ప్రతిష్టించిన గణేష్ మండపాన్ని మంత్రి పువ్వాడ సందర్శించి స్వామి వారికి దర్శించుకున్నారు. అనంతరం కమిటీ అధ్వర్యంలో ఎర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.