చంద్రబాబు ను చూస్తే బీఆర్ఎస్ కు భయం పట్టుకుంది: కూరపాటి
విలేకర్ల సమావేశంలో మంత్రి పువ్వాడ పై ద్వజమెత్తిన కూరపాటి వెంకటేశ్వర్లు
చంద్రబాబు ను చూస్తే బీఆర్ఎస్ కు భయం పట్టుకుంది
== ఖమ్మం జిల్లా అభివద్ది అయ్యింది తెలుగుదేశం హాయంలోనే
== చంద్రబాబు హైదరాబాద్ కు ఐటీ తీసుకొచ్చినప్పడు పువ్వాడ అజయ్ రాజకీయాల్లో ఎక్కడున్నాడో ఆయనకే తెలియదు..?
== విలేకర్ల సమావేశంలో మంత్రి పువ్వాడ పై ద్వజమెత్తిన కూరపాటి వెంకటేశ్వర్లు
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
చందబ్రాబు ను చూస్తే, ఖమ్మంలో బహిరంగ సభకు వచ్చిన జనంను చూసిన తరువాత బీఆర్ఎస్ పార్టీ నాయకులకు దడ పుట్టిందని, భయం పట్టుకుందని పార్టీ ఖమ్మం పార్లమెంట్ అధ్యక్షులు కూరపాటి వెంకటేశ్వర్లు తెలిపారు. గురువారం తెలుగుదేశంపార్టీ జిల్లా కార్యాలయంలో పార్లమెంట్ అధ్యక్షులు కూరపాటి వెంకటేశ్వర్లు అధ్యక్షతన విలేకరుల సమావేశం జరిగింది. వారు మాట్లాడుతూ ముందుగా నిన్న జరిగిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భారీ బహిరంగ సభకు స్వచ్ఛందంగా తండోపతండాలుగా వచ్చి సభను విజయవంతం చేసిన తెలుగుదేశంపార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు.
ఇది కూడా చదవండి: తెలంగాణకు తెలుగుదేశం అవసరం: చంద్రబాబు
అనంతరం ఖమ్మం నగరంలో జరిగిన భహిరంగ సభను ఉద్దేశించి టిఆర్ఎస్ పార్టీ నలుగురు మంత్రులు స్పందించడం ఆస్యాస్పదంగా ఉందన్నారు. ఉమ్మడి జిల్లాలోని ఏడు మండలాలను సీలేరు ప్రాజెక్టును లాక్కున్నారని, అన్న మంత్రి అజయ్ అప్పుడు మీ మంత్రివర్గం ఏం చేస్తుందనీ, ఎందుకు పోరాడటం లేదని ప్రశ్నించారు. ఎన్టీఆర్ మహనీయుడని వారంటే గౌరవం ఉంది అంటూనే, వారు పెట్టిన పార్టీని హేళన చేయడం మీకు తగదని సూచించారు. చంద్రబాబు ఏ మొహం పెట్టుకొని ఖమ్మంలో సభ పెట్టావు అన్న మంత్రికి సూటి ప్రశ్న వేస్తున్నమని, ఖమ్మంకు నీ స్వంతంగా తీసుకొచ్చిన నిధులు ఎంతో చెప్పాలని ప్రశ్నించారు. ఖమ్మం అభివృద్ధి చెందింది టీడీపీ హయాంలోనేనని, తెలంగాణలో అది ఖమ్మం గడ్డలో ప్రజలను ఓటు అడిగే హక్కు ఒక తెలుగుదేశంపార్టీకే ఉందని అన్నారు. హైదరాబాద్ కు ఐ.టీ తెచ్చానని ఖమ్మం అభివృద్ధి తానే చేశానని చెప్పుకోవడం హాస్యస్పదమన్నారు. చంద్రబాబు ఐటీని హైదరాబాద్ కు తీసుకొచ్చినప్పుడు మీరు రాజకీయంగా కూడా లేరనే విషయాన్ని గుర్తు చేశారు. ఒక్కసారి గూగుల్లో చూసి ఎవరు తీసుకొచ్చారో తెలుసుకోవచ్చాన్నరు. ఖమ్మం సభలో బాబు ప్రసంగంలో టిఆర్ఎస్ పార్టీని గానీ, నాయకులను గానీ ఎక్కడ విమర్శించలేదని, అది బాబు గొప్పతనం అని అన్నారు.
ఇది కూడా చదవండి: ఖమ్మం రోటరీనగర్ లో క్షుద్రపూజలు
ఆయన్ను మీరు చూసి నేర్చుకోవాల్సిన అవసరం టీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఉందన్నారు. ఆ జన సందోహాన్ని చూసి మీ పార్టీకీ గుండెల్లో గుబులు పుడుతోందని అన్నారు. అందుకే ఆయన మాట్లాడంగానే ఇలా స్పందిస్తూ విచిత్రకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో రాష్ట్ర నాయకులు చంద్రహస్, ప్రధాన కార్యదర్శి గుత్తా సీతయ్య, రాష్ట్ర కార్యదర్శి సానబోయిన శ్రీనివాస్ గౌడ్, టిఎన్టియుసి రాష్ట్ర కార్యదర్శి వాసిరెడ్డి భాస్కరరావు, నగర అధ్యక్షులు వడ్డేo విజయ్, ఐటిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఆకారపు శ్రీనివాస్, అధ్యక్షుడు సన్నే అనిల్, తెలుగు యువత అధ్యక్షులు నల్లమల రంజిత్, నగర ప్రధాన కార్యదర్శి ప్యారిస్ వెంకన్న, చింత నిప్పు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.