త్వరలో లకారం వద్ద మరో అద్భుతం ఆవిష్కృతం: మంత్రి
రూ.10 కోట్లతో అండర్ గ్రౌండ్ పైపులైన్ నిర్మాణం.. వర్షం, మురుగు నీరు వేర్వేరుగా వెళ్లేందుకు ప్రణాళిక.
త్వరలో లకారం వద్ద మరో అద్భుతం ఆవిష్కృతం: మంత్రి
== రూ.10 కోట్లతో అండర్ గ్రౌండ్ పైపులైన్ నిర్మాణం.. వర్షం, మురుగు నీరు వేర్వేరుగా వెళ్లేందుకు ప్రణాళిక.
== కొనసాగుతున్న పనులను పరిశీలించిన మంత్రి పువ్వాడ.
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
ఖమ్మం నగరాభివృద్దిలో భాగంగా ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం అందించడం.. అన్ని హంగులతో నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దడమే మా అభిమతమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. నగరంలోని లకారం ట్యాండ్ బండ్ వద్ద ఉన్న మురుగు కాల్వను శనివారం సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించిన మంత్రి రూ.10 కోట్లతో అండర్ గ్రౌండ్ పైపులైన్ ద్వారా మురుగు, వర్షపు నీరు వేర్వేరుగా వెళ్లేందుకు చేపట్టిన పనులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రెండు లకారం ల మధ్య దీర్ఘకాలికంగా ఉన్న మురుగు సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టడం ద్వారా అనేక రోగాల బారి నుండి ఇక్కడ ప్రజలను కాపాడగలం అని అన్నారు. అంతేకాక ఖమ్మానికే అందం తెచ్చిన లకారం ట్యాంక్ బండ్ వద్ద త్వరలోనే మరో అద్భుతాన్ని ఆవిష్కరించబోతున్నాం’ అని అన్నారు. ఖమ్మం వైరా రోడ్డులోని నాగార్జున ఫంక్షన్ హాల్ నుంచి చెరువు బజార్ మజీద్ వరకు రూ.10 కోట్లతో అండర్ గ్రౌండ్ పైప్ లైన్ ద్వారా మురుగు, వర్షపు నీరు వేర్వేరుగా వెళ్లేందుకు పకా ప్రణాళికతో కార్యాచరణ చేపట్టామన్నారు. అండర్ గ్రౌండ్ పైప్ లైన్ ద్వారా మురుగు నీరు ప్రకాష్ నగర్ వద్ద సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్కి వెళ్లి, అకడ శుద్ధి చేయబడుతుందన్నారు. మరో పైప్ లైన్ ద్వారా వెళ్లిన వర్షపు నీరు నేరుగా మున్నేరులో కలుస్తాయన్నారు.
ఈ ప్రక్రియతో పొల్యూషన్ రహితంగా ఎకడా ప్రజలకు ఇబ్బందులు కలుగకుండా ఉంటుందన్నారు. అండర్గ్రౌండ్లో పైప్లైన్ పై భాగంలో ప్రజలకు ఆహ్లాదం పంచే పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతామన్నారు. అనంతరం పనులు పరిశీలించి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పనుల అనంతరం పై భాగంలో సుందరీకరిస్తామన్నారు. మంత్రి వెంట నగర మేయర్ పునుకొల్లు నీరజ, పబ్లిక్ హెల్త్ ఈఈ రంజిత్, మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, తదితరులు ఉన్నారు.