మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టడంలో చర్యలు తీసుకోవాలి: కలెక్టర్
సరఫరా నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాలి
ఖమ్మం, సెప్టెంబర్ 23(విజయంన్యూస్):
సమావేశంలో పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్. వారియర్ మాట్లాడుతూ, సరదా కోసం సిగరెట్తో మొదలవుతున్న యువత వ్యసనాలు, మద్యం, ఆ తరువాత మాదక ద్రవ్యాల వరకు వెళ్తుందన్నారు. మాదక ద్రవ్యాల వినియోగాన్ని కట్టడి చేయకుంటే భవిష్యత్తులో సమాజంపై తీవ్ర దుష్ప్రబావం చూపుతుందని అన్నారు. మత్తుకు బానిసగా మారిన యువతను టార్గెట్ చేసుకున్న గంజాయి మాఫియా, చివరకు వారినే ఏజెంట్లుగా మార్చి వ్యాపారాన్ని చాపకింద నీరులా విస్తరింపజేయ ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. మత్తు పదార్థాలకు బానిసలై వారు సామాజిక సంబంధాలను సైతం కోల్పోతున్నారని, తరచూ ఉద్రేకానికి లోనవుతూ, నేరాలకు పాల్పడుతున్నారని అన్నారు. జిల్లాలో కల్టీవేషన్ ప్రాంతాలు లేవని ఆయన అన్నారు. ఈ సంవత్సరం ఇప్పటి వరకు 20 కేసులు, 38 మంది వ్యక్తులపై నమోదు చేసి, రూ. 62 లక్షల విలువైన 531 కిలోల గంజాయిని సీజ్ చేసినట్లు ఆయన అన్నారు. గట్టి నిఘాపెట్టి పూర్తిగా నియంత్రిస్తామని సిపి తెలిపారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు బి. సత్యప్రసాద్, డి. మధుసూదన్ నాయక్, ఖమ్మం మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, అదనపు డిసిపి కే.ఆర్.కె. ప్రసాద్ రావు, జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ నాగేందర్ రెడ్డి, ఆర్డీవోలు, ఏ.సి.పిలు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.