రాత్రిళ్లు అత్యవసరాల కోసం బస్సు ఆపండి!
ఉత్తర్వులు జారీ చేసిన ఆర్టీసీ.
(హైదరాబాద్ ప్రతినిధి – విజయంన్యూస్) : –
రాత్రివేళల్లో ప్రయాణించేవారు తమ అత్యవసరాల కోసం బస్సును ఆపవచ్చని ఆర్టీసీ ఉత్తర్వులు జారీ చేసింది. టోల్ప్లాజాల వద్ద అత్యవసర పరిస్థితుల్లో అక్కడున్న సదుపాయ గదుల(కన్వీనియన్స్ రూమ్స్) వినియోగించుకోవచ్చని ఇక నుంచి బస్సులో అనౌన్స్ చేయాలి అని టీఎస్ఆర్టీసీ ఆదేశాలిచ్చింది. అత్యవసరాలకు వెళ్లాలంటే ఇబ్బంది పడుతున్నట్లు ఓ మహిళా ప్రయాణికురాలు ఇటీవల అధికారుల దృష్టికి తీసుకురావటంతో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ఈ మేరకు చర్యలు చేపట్టారు.
దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు సౌకర్యంగా ఉండేందుకు రోడ్డు వెంట ఉండే దాబాలు, మంచి హోటళ్లను గుర్తించాలి. అలాంటి ప్రాంతాల్లో మహిళలు తమ అత్యవసరాలను వినియోగించుకోవడానికి బస్సులను కొద్ది నిమిషాలు నిలపాలి. ఆ పరిస్థితులు లేనిపక్షంలో టోల్ప్లాజాలను దాటే క్రమంలో ‘ఇక్కడ సదుపాయ గదులు అందుబాటులో ఉన్నాయి. అత్యవసరమైన వారు ఉపయోగించుకోవచ్చు’ అని డ్రైవర్ బస్సులో అనౌన్స్ చేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
also read :-యువతి, యువకులను నగ్నంగా చూసిందని ఘోరం.