Telugu News

ప్రపంచకప్ నుంచి భారత్ ఔట్

ఇంగ్లాండ్ పై భారత్ ఘోర పరాజయం

0

ప్రపంచకప్ నుంచి భారత్ ఔట్

== ఇంగ్లాండ్ పై భారత్ ఘోర పరాజయం
== టీ20 వరల్డ్ కప్ ఫైనల్ చేరిన ఇంగ్లండ్
== 20 ఓవర్లలో 168 పరుగులు చేసిన టీమిండియా
== ఒక్క వికెట్ కూడా నష్టపోకుండానే లక్ష్యాన్ని ఛేదించిన ఇంగ్లండ్
== 80 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన జాస్ బట్లర్
== కెప్టెన్ ను మించి వీర విహారం చేసిన అలెక్స్ హేల్స్
== పాక్ తో పైనలో ఆడనున్న ఇంగ్లండ్
(క్రీడావిభాగం-విజయంన్యూస్)
టీ20 వరల్డ్ కప్ నుంచి టీమీండియా ఇంటిదారి పట్టింది.. సెమీపైనల్ మ్యాచ్ లో ఇంగ్లాండ్ చేతిలో ఘోరంగా ఓడిపోయింది.. ఎవరు ఊహించని విధంగా, కనీసం పోటీ ఇవ్వలేకుండా టీమ్ సభ్యులంతా చేతులేత్తేసిన పరిస్థితి కనిపించింది.. కనీసం ఇంగ్లాండ్ బ్యాట్స్ మెన్స్ ను నిలవరించే పరిస్థితి కనిపించలేదు.. దీంతో భారత్ ఘోరంగా అంటే ఘోరంగా ఓటమి చెందింది.. ఇంగ్లాండ్ జట్టు టీ20 ప్రపంచకప్ టైటిల్ రేసులో నిలిచింది. భారత్ శాశ్వత శత్రువు పాకిస్తాన్ తో ఇంగ్లాండ్ జట్టు పోటీ పడనుంది.

ఇది కూడా చదవండి: తుమ్మల వ్యూహమేంటీ..?

టీ20 వరల్డ్ కప్ లో హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగిన టీమిండియా టైటిల్ పోరుకు ఒక్క అడుగు దూరంలో ఘోరంగా పెయిలూర్ అయ్యింది.. టీమీండియా పూర్తిగా చేతులేత్తిసి ఓటమి చూసింది..  గురువారం ఇంగ్లండ్ తో జరిగిన రెండో సెమీ ఫైనల్ లో భారత్ జట్టు ఘోరాతిఘోరంగా ఓడిపోయింది. బ్యాటింగ్ లో ఫరవా లేదనిపించిన భారత జట్టు… బౌలింగ్ లో మాత్రం అత్యంత పేలవ ప్రదర్శనను కనబరచింది. ప్రత్యర్థి జట్టు వికెట్లు తీయడంలో పూర్తిగా విఫలమైపోయిన భారత బౌలర్లు… ఇంగ్లండ్ పరుగుల వరదకు అడ్డుకట్ట వేయడంలో మరింతగా విఫలమయ్యారు. వెరసి ఈ మ్యాచ్ లో గెలిచి నేరుగా ఫైనల్ చేరుతుందన్న సగటు క్రికెట్ అభిమానుల ఆశలను రోహిత్ శర్మ సేన వమ్ము చేసింది. సెమీస్ లో ఘోర పరాభవంతో టీమిండియా రిక్త హస్తాలతోనే ఇంటి ముఖం పట్టింది.

ఇది కూడా చదవండి: బి జె పి వి అసత్యపు ప్రచారం- మంత్రి గంగుల ధ్వజం

టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు ఛేజింగ్ ను ఎంచుకోగా… ఫస్ట్ బ్యాటింగ్ చేసిన భారత జట్టు ప్రత్యర్థి ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించడంలో తడబడింది. ఎప్పటిలానే ఓపెనర్ కేఎల్ రాహుల్ మరోమారు విఫలమైతే… అప్పటిదాకా వీర విహారం చేసిన సూర్యకుమార్ యాదవ్ కీలక మ్యాచ్ లో విఫలమయ్యాడు. ఆ ఇద్దరి బాటలోనే రిషబ్ పంత్ కూడా చేతులెత్తేశాడు. ఇక జట్టుకు అండగా నిలిచిన విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా హాఫ్ సెంచరీలతో విరుచుకుపడినా ఇంగ్లండ్ ముందు భారీ లక్ష్యాన్ని టీమిండియా నిర్దేశించలేకపోయింది. కెప్టెన్ రోహిత్ శర్మ ఫరవాలేదనిపించినా కూడా జట్టుకేమీ ప్రయోజనం కలగలేదు.

ఇది కూడా చదవండి: ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రమాణస్వీకారం
169 పరుగుల విజయలక్ష్యంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించిన ఈ జట్టు కెప్టెన్ జాస్ బట్లర్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. బట్లర్ కు తోడుగా మరో ఎండ్ లో ఓపెనర్ గా క్రీజులోకి వచ్చిన అలెక్స్ హేల్స్ కెప్టెన్ ను మించి స్వైర విహారం చేశాడు. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ లో సింగిల్ వికెట్ పడకుండానే వీరిద్దరే తమ జట్టుకు విజయాన్ని అందించి టీ20 వరల్డ్ కప్ ఫైనల్ లోకి తీసుకెళ్లారు. మొదటి బంతి నుంచే బాదుడు ప్రారంభించిన బట్లర్, హేల్స్… భారత బౌలర్లను చీల్చి చెండాడారు. 48 బంతులను ఎదుర్కొన్న బట్లర్.. 9 ఫోర్లు, 3 సిక్స్ లతో 80 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరో ఎండ్ లో 47 బంతులను మాత్రమే ఎదుర్కొన్న హేల్స్ 4 ఫోర్లు, 7 సిక్స్ లతో ఏకంగా 86 పరుగులు రాబట్టాడు. ఫలితంగా ఒక్క వికెట్ కూడా నష్టపోకుండానే ఇంగ్లండ్ జట్టు ఇంకో 4 ఓవర్లు మిగిలి ఉండగానే 170 పరుగులు చేసింది. భారత్ పై 10 వికెట్ల భారీ తేడాతో విజయం సాధించి సగర్వంగా ఫైనల్ చేరింది.

ఇది కూడా చదవండి: ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టులు దుశ్చర్యం