తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ దోస్తీ : మంత్రి నిరంజన్ రెడ్డి
** అందుకు హుజురాబాద్ ఎన్నికలే ప్రత్యక్ష సాక్ష్యం
తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ దోస్తీ : మంత్రి నిరంజన్ రెడ్డి
** అందుకు హుజురాబాద్ ఎన్నికలే ప్రత్యక్ష సాక్ష్యం
(హైదరాబాద్-విజయం న్యూస్)
తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు రెండు దోస్తీ చేస్తున్నాయని, ఆ రెండు పార్టీలు కలిసి పని చేస్తున్నాయని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ఆరోపించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఓట్లు భాజపా అభ్యర్థికి వేయించలేదా అని నిలదీశారు. కాంగ్రెస్ త్వరలోనే భాజపాలో విలీనం కావడం ఖాయమన్నారు. హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో నిరంజన్రెడ్డి మీడియాతో మాట్లాడారు.
‘‘అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుకు అమ్ముతున్నది భాజపా కాదా?ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుకు అమ్మి ఉద్యోగాలు లేకుండా చేస్తున్నది ఎవరు? పెట్రోల్, డీజిల్ ధరలపై కాంగ్రెస్ నేతలు కేంద్రాన్ని ఎందుకు నిలదీయట్లేదు? ధాన్యం విషయంలో భాజపాను కాంగ్రెస్ పార్టీ ఎందుకు నిలదీస్తలేదు. దాదాపు 9లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలని బండి సంజయ్ మోదీని అడగాలి. కేంద్రాన్ని అడగలేని బండి సంజయ్ రాష్ట్రంలో దీక్షలు చేస్తున్నారు’’ అని నిరంజన్రెడ్డి విమర్శించారు.
also read :-చూపు తెప్పించారు.. తిర్యాణి పోలిసుల సంకల్పం …