Telugu News

==ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా..? : సీఎల్పీ నేత భట్టి

== తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా..?

0

==ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా..? : సీఎల్పీ నేత భట్టి
== తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా..?
== రేవంత్ రెడ్డి అరెస్టును ఖండిస్తున్నాం
== ప్రతిపక్ష నాయకులు గొంతు నొక్కుతున్న సర్కార్
== తెలంగాణలో అసలు ప్రజాస్వామ్యం ఉందా…
== సర్కార్ పై సీఎల్పీనేత భట్టి ఆగ్రహం
== పండ్రేగుపల్లి ఆనకట్టను పరిశీలించిన ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా..?
== తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా..?
== రేవంత్ రెడ్డి అరెస్టును ఖండిస్తున్నాం
== ప్రతిపక్ష నాయకులు గొంతు నొక్కుతున్న సర్కార్
== తెలంగాణలో అసలు ప్రజాస్వామ్యం ఉందా…
== సర్కార్ పై సీఎల్పీనేత భట్టి ఆగ్రహం
== పండ్రేగుపల్లి ఆనకట్టను పరిశీలించిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క
(ఖమ్మంప్రతినిధి, మధిర- విజయంన్యూస్);-

తెలంగాణ రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం బ్రతికే ఉందా…? ప్రశ్నించినవారిపై అక్రమ కేసులు బనాయిస్తూ, అక్రమ అరెస్టులు చేస్తూ ప్రశ్నించే గొంతుకను నొక్కేస్తున్నారని, అందుకే తెలంగాణలో ప్రజాస్వామ్యంను చంపేస్తున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్లు వేయాలని ఆందోళనకు పిలుపునిచ్చిన పిసిసి అధ్యక్షులు, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డిని గురువారం పోలీసులు అరెస్టు చేయడాన్ని సీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క తీవ్రంగా ఖండించారు. నిరసన వ్యక్తం చేయకుండా రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలను హౌస్ అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య వ్యవస్థ ను కూనీ చేయడమే అని మండిపడ్డారు. మధిర నియోజకవర్గంలోని మధిర మండలం పండ్రేగుపల్లి గ్రామంలో నిర్మాణంలో ఉన్న అనకట్టను ఆయన పరిశీలించారు.

also read :-***కేసీఅర్ పుట్టినరోజు సందర్భంగా పట్టాల పంపిణి చేసిన మంత్రి పువ్వాడ

ఈ సందర్భంగా అక్కడ నిలిచిన పనుల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులు వేగవంతం చేయాలని సూచించారు. అనంతరం ఇటీవల అనారోగ్యానికి గురైన ముదిగొండ మండల మాజీ జడ్పీటీసీ పసుపులేటి దేవీంద్రాన్ని పరామర్శించారు. ముదిగొండ గ్రామ శాఖ కాంగ్రెస్ అధ్యక్షుడు మందరపు శ్రీనివాసరావు ఇంటికెళ్లి వారి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా విలేకర్లతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఎన్నికల హామీలను అమలు చేయని ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకొచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు పిలుపునివ్వడం కూడా తెలంగాణలో నేరం అయినట్టుగా కెసిఆర్ ప్రభుత్వం నిర్బంధ కాండను కొనసాగించడం అప్రజాస్వామికమని అన్నారు. రాష్ట్రంలో పోలీసులను పురిగొల్పి నిర్బంధాన్ని ప్రయోగిస్తూ ప్రతిపక్ష నాయకుల గొంతులను టిఆర్ఎస్ ప్రభుత్వం నొక్కుతున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

also read :-త్రిసభ్య కమిటీ భేటీ.. ఐదు అంశాలపై కుదరని ఏకాభిప్రాయం

ప్రజల సమస్యలపై ప్రతిపక్ష పార్టీలు నిరసనలు వ్యక్తం చేయడం రాజ్యాంగ కల్పించిన హక్కు అని అన్నారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కెసిఆర్ ప్రభుత్వం కాలరాస్తూ తెలంగాణలో కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రధాన ప్రతిపక్ష నాయకులను ప్రజా సమస్యల పరిష్కారం కొరకు నిర్వహించే ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన కుండా ప్రతి రోజు అరెస్టులు చేయడం ఏమిటని పోలీసులను నిలదీశారు. ప్రతిపక్ష నేతలను అరెస్ట్ చేయడమే కేసీఆర్ పనిగా పెట్టుకున్నారని విమర్శించారు.

స్వాతంత్రం వచ్చిన అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇంత నిర్బంధ కాండ ఎప్పుడు లేదన్నారు. కేసీఆర్ నియంతృత్వ పోకడలను ప్రజాస్వామిక వాదులు, తెలంగాణ మేధావులు అందరూ ఖండించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజా ఉద్యమాలను అణచి వేయడానికి ప్రభుత్వం ఇలాగే నిర్బంధం కొనసాగిస్తే కేసీఆర్ కు ప్రజల తిరుగుబాటు తప్పదు అని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గప్రసాద్, జిల్లా కిసాన్ జిల్లా అధ్యక్షుడు మొక్కా శేఖర్ గౌడ్, నాయకులు రాయల నాగేశ్వరరావు, మండల కమిటీ అధ్యక్షుడు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు