Telugu News

తమ్మినేని కృష్ణయ్య కుటుంబాన్ని పరామర్శించిన పొంగులేటి

అత్యంత బాధకారం..దోషులకు శిక్ష పడాల్సిందేనన్న శీనన్న 

0

తమ్మినేని కృష్ణయ్య కుటుంబాన్ని పరామర్శించిన పొంగులేటి

== అండగా ఉంటానని హామినిచ్చిన మాజీ ఎంపీ 

== అత్యంత బాధకారం..దోషులకు శిక్ష పడాల్సిందేనన్న శీనన్న 

(ఖమ్మం రూరల్-విజయంన్యూస్):

తెరాస రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం ఖమ్మం రూరల్ మండలంలో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఇటీవల మృతిచెందిన తెల్గారుపల్లి గ్రామానికి చెందిన టీఆర్ఎస్ నాయకుడు తమ్మినేని కృష్ణయ్య కుటుంబాన్ని పరామర్శించారు. కృష్ణయ్య చిత్రపటానికి పూలు వేసి నివాళ్లర్పించారు. ఆయన మృతిపట్ల తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. కుటుంబసభ్యులకు సానుభూతి ప్రకటించారు. ఆయన మృతికి కారణమైన వారికి కఠినమైన శిక్ష తప్పకుండా పడుతుందన్నారు.

ఇది కూడా చదవండి: వినాయకుడ్ని దర్శించుకున్న పొంగులేటి

అనంతరం మండలంలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక మండపాలను సందర్శించారు. ప్రత్యేక పూజలు చేశారు. అన్నదాన కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ పర్యటనలో పొంగులేటి వెంట తెరాస రాష్ట్ర నాయకురాలు మద్దినేని బేబి స్వర్ణకుమారి, డీసీసీబీ మాజీ ఛైర్మన్ మువ్వా విజయబాబు, డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, తోట చిన్న వెంకటరెడ్డి, అజ్మీరా అశోక్ నాయక్, మద్ది కిశోర్ రెడ్డి, తిప్పిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ప్రతాపనేని రఘు, సూతగాని ఉపేందర్, మెండె వెంకటేష్ యాదవ్, పొన్నం సాయి, రమేష్, మహేష్, చారి, యువనేత గోపి, అయిలూరి వెంకటేశ్వరరెడ్డి, చావా శివరామకృష్ణ, నెల్లూరి భద్రయ్య, తిరుమలయాపాలెం మాజీ ఎంపీపీ అశోక్ , కొడాలి గోవిందరావు, ఉమ్మినేని కృష్ణ, దేవరపల్లి అనంతరెడ్డి, ఒంటికొమ్ము శ్రీనివాసరెడ్డి, వెంకన్న తదితరులు ఉన్నారు.