తిరుపతిలో మంత్రి పువ్వాడ అజయ్ కు ఘన స్వాగతం
★★ తిరుమలలో పువ్వాడ కుటుంబ సభ్యుల పూజలు
(ఖమ్మం-విజయం న్యూస్)
శ్రీ తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం ఆంధ్ర ప్రదేశ్ లోని తిరుపతి; రేణిగుంట విమానాశ్రయంకు శుక్రవారం కుటుంబ సమేతంగా చేరుకున్న తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కు ఆయన అభిమానులు, మద్దతుదారులు జోరు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఘన స్వాగతం పలికారు. ఇటీవల తన కుమారుని వివాహమైన సందర్భంగా నూతన వధూవరులను విమానాశ్రయంలో కలిసి పలువురు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం నవ దంపతులు పువ్వాడ నయన్ రాజ్ , అపర్ణ కేక్ కట్ చేయగా అభిమానులు అభినంధనలు తెలిపారు.
ఇది కూడ చదవండి:- సర్వం సిద్దమైన సర్కార్ మెడికల్ కళాశాల
శనివారం ఉదయం శ్రీవారిని కుటుంబ సమేతంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దర్శించుకోనున్నారు.