పులకించిన పిండిప్రొల్
– ఎమ్మెల్సీ తాతా మదుకు ఘన స్వాగతం
– కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు లబిస్తుంది- కందాళ
– నాకు రాజకీయ చైతన్యం కల్పించిన పిండిప్రొల్ కు రుణపడి ఉంటా – తాతా మదు
(తిరుమలాయపాలెం-విజయం న్యూస్)
ఎమ్మెల్సీ, టిఆర్ఎస్ జిల్లా అధ్యక్షులుగా ఎన్నికై తొలిసారి తన స్వగ్రామం పిండిప్రొల్ లో అడుగిడిన తాతా మదుసూదన్ కు టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు, గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. బాజా భజంత్రీలు, బాణా చంచా మోతలతో గ్రామం దద్దరిల్లింది. ఓపెన్ టాప్ జీప్ పై పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణంతో ఎమ్మెల్సీ తాతా మదుఖాన్ భారీ ర్యాలీలో పాల్గొన్నారు.
also read :-పాలేరు నియోజవకర్గంలో కందాళ సుడిగాలి పర్యటన
తొలుత వేదికపై బ్రామణొత్తములు ఆశ్వీర్వదించనాలు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ కి చేసిన సేవలను గుర్తించి తాతా మదుకు ఎమ్మెల్సీగానే కాకుండా పార్టీ అధ్యక్షుడు గా నియమించారు. పిండిప్రొల్ లో ఉన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తా. అన్ని వర్గాలకు న్యాయం చేస్తా. మదు తో కలిసి పనిచేసి నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతాం. ఎమ్మెల్సీ తాతా మదుసూదన్ మాట్లాడుతూ నాకు రాజకీయ చైతన్యం కల్పించి నలుగురిలో నన్ను ఒకడిగా నిలిపిన పిండిప్రొల్ కు రుణపడి ఉంటా. నాపై నమ్మకంతో ఈ పదవులను ఇచ్చిన సిఎం కెసిఆర్ కి ,పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి కృతజ్ఞతలు తెలియజేశారు. కెసిఆర్ తన పై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తా. టిఆర్ఎస్ ప్రభుత్వం లోనే తిరుమలాయపాలెం సస్యశ్యామలంగా మారింది.
also read :-తెలంగాణకే తలమానికంగా మారిన శ్రీ మహాశక్తి ఆలయం..
గత ప్రభుత్వాలు అనుసరించిన విధానాల వల్లే రాష్ట్రం వెనక బాటుకు గురైంది. తెలంగాణ ప్రభుత్వ హయాంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందింది. చామకకూరి రాజ్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు పోట్ల నాగేశ్వరరావు, నల్లమల వెంకటేశ్వరరావు, నగర అధ్యక్షులు పగడాల నాగరాజు, కార్పోరేటర్లు కమర్తపు మురళి, కూరాకుల వాసు డిసిసిబి డైరెక్టర్లు ఇంటూరి శేఖర్, చావా వేణు గోపాల్, డిసిఎంస్ డైరెక్టర్ నాగుబండి శ్రీనివాసరావు, వున్నం బ్రహ్మయ్య, పాలేరు నియోజకవర్గంలోని మండలాల ఎంపిపిలు, టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.