Telugu News

పేదల కళ్ళలో ఆనందం నింపాలనే.. కంటి వెలుగు.

నగరంలోని 25వ డివిజన్ నందు ఎర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి పువ్వాడ.

0
పేదల కళ్ళలో ఆనందం నింపాలనే.. కంటి వెలుగు.
== నగరంలోని 25వ డివిజన్ నందు ఎర్పాటు చేసిన కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించిన మంత్రి పువ్వాడ.
(ఖమ్మం ప్రతినిధి-విజయం న్యూస్)
పేదల కళ్ళల్లో ఆనందం నింపడం కోసమే కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రభుత్వం రూపొందించిందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. నగరంలోని 25వ డివిజన్ మేదర బజార్ లోని బస్తి నందు ఎర్పాటు చేసిన కంటి వెలుగు వైద్య శిబిరాన్ని మంత్రి పువ్వాడ ప్రారంభించారు. వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగు శిబిరాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ముందు చూపుతో రాష్ట్రంలో ప్రజలందరికీ కంటి వెలుగు కార్యక్రమాన్ని మొదటి విడత ప్రారంభించి అనేకమందికి కంటి అద్దాలను అందించారని, తిరిగి రెండో విడత కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా చేపట్టి పేదల కంట్లో వెలుగులు నింపారని అన్నారు. ప్రజలు ఎవరూ కంటి సమస్యలతో బాధపడవద్దనే లక్ష్యంతో కంటి పరీక్షలను నిర్వహించి అద్దాలతో పాటు మందులు ఉచితంగా పంపిణీ చేస్తున్నారని, అవసరమైన వారికి కంటి ఆపరేషన్లను సైతం చేయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మేయోర్ పునుకొల్లు నీరజ, జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్, సుడా చైర్మన్ విజయ్ కుమార్, కార్పొరేటర్ గోళ్ళ చంద్రకళ వెంకట్, మడురి ప్రసాద్, డీఎంఅండ్ హెచ్ఓ మాలతి, తదితరులు ఉన్నారు.