Telugu News

**గరుడ ప్లస్ ఛార్జీలను తగ్గించిన టి.ఎస్.ఆర్టీసీ. 

*ఇక రాజధాని ఫేర్ తో గరుడ ప్లస్ లో ప్రయాణించొచ్చు. 

0

**గరుడ ప్లస్ ఛార్జీలను తగ్గించిన టి.ఎస్.ఆర్టీసీ. 

**ఇక రాజధాని ఫేర్ తో గరుడ ప్లస్ లో ప్రయాణించొచ్చు. 

** మంత్రి పువ్వాడ సూచనలతో ఆమోదించిన సంస్థ.

**(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

 తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రయాణీకులకు మరింత దగ్గరయ్యేందుకు అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది . 

సంస్థ బాగుతో పాటు ప్రయాణీకుల రవాణా సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించిన విషయం తెలిసిందే . 

ఈ దిశలో వడివడిగా నిర్ణయాలు తీసుకుంటూ మెరుగైన సేవలు అందించేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తుంది సంస్థ. రాష్ట్రముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రజా రవాణాను ప్రయాణికులకు మరింత చేరువ చేసే ప్రయత్నంలో భాగంగా తీసుకున్న పలు నిర్ణయాలను సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి, వైస్ ఛైర్మన్ , మేనేజింగ్ డైరెక్టర్ వి.సి.సజ్జనార్ తో చర్చించి ప్రజా ప్రయోజనకర నిర్ణయాలు అమలు చేస్తున్నారు. ‘ప్రజల ఆదరణ -సంస్థకు ప్రేరణ’ గా భావించిన మంత్రి పువ్వాడ ప్రయాణీకులకు ఈ శుభవార్త అందించారు .

also read :-ప్రజల ప్రేమాభిమానాలే శాశ్వతం:మాజీ ఎంపీ పొంగులేటి

బస్సు ఛార్జీలు పెంచడమే కానీ తగ్గించడం అనే మాటను తుడిచేశారు . తాజాగా గరుడ ప్లస్ ఛార్జీలను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ప్రయాణీకులకు విలాసవంతమైన ప్రయాణం చేసేందుకు వీలుగా నడుస్తున్న ఏసీ గరుడ ప్లస్ ఛార్జీలను రాజధాని టిక్కెట్టుకు సమానంగా సవరించడం కొసమెరుపు . దీంతో ప్రయాణీకులు ఎంచక్కగా రాజధాని ఫేర్ తో గరుడ ప్లస్ బస్సులో ప్రయాణించొచ్చుని సంస్థ స్పష్టం చేసింది.  తగ్గించిన ఛార్జీలు షెడ్యూల్ , ప్రత్యేక సర్వీసులకు మార్చి 31 వరకు వర్తించనున్నాయి. కాగా, అంతరాష్ట్ర సర్వీసులో అయితే తెలంగాణ సరిహద్దు దాటిన తరువాత అంతకు మునుపు ఉన్న అంతరాష్ట్ర భాగంలో వర్తించే ఛార్జీలు వసూలు చేయనున్నట్లు వెల్లడించారు.

కర్ణాటక ఆర్టీసీతో సమానంగా ప్లెక్లీ ఛార్జీలు అమలులో ఉన్న హైదరాబాద్ – బెంగళూరు మార్గంలో నడిచే ఏసీ సర్వీసులకు మాత్రం ఇది వర్తించదని స్పష్టం చేశారు. రవాణా రంగంలో ఉన్న పోటీని తట్టుకుని నిలబడడానికి ప్రయాణీకులకు మరింత మెరుగైన సేవలు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సంస్థ ఎం.డి సజ్జనార్ అన్నారు .

also read :-శ్రీల‌క్ష్మీ న‌ర‌సింహ్మ‌స్వామిని ద‌ర్శించుకున్న సీఎం కేసీఆర్

హైదరాబాద్ – విజయవాడ మధ్య రూ .100,  హైదరాబాద్- ఆదిలాబాద్ మధ్య రూ .111, హైదరాబాద్ – భద్రాచలం మధ్య రూ .121, హైదరాబాద్- వరంగల్ మధ్య రూ .54 లు తగ్గినట్లు ఆయన వివరించారు. ప్రజా రవాణా సేవల్ని వినియోగించుకుంటున్న ప్రయాణీకులు ఆర్టీసీని మరింత ఆదరించి సంస్థ అభ్యున్నతికి దోహదపడాలని వారు కోరారు.

== గరుడ ప్లస్ చార్జీలు తగ్గింపు : ఆర్టీసీ డీఎం

ఖమ్మం నుండి హైదరాబాద్,కూకట్ పల్లి వరకు నడిచే గరుడ ప్లస్ బస్సులకు ప్రయాణ ఛార్జీలు తగ్గించి నట్లు ఆర్టీసీ ఖమ్మం బస్సు డిపో మేనేజర్ డి.శంకర్రావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఖమ్మం నుండి హైదరాబాద్,కూకట్ పల్లి మార్గంలో ఇప్పటి వరకు నడుపబడుతున్న రాజధాని సర్వీసుల స్థానంలో ప్రవేశపెట్టిన గరుడ ప్లస్ బస్సులకు మాత్రమే రాజధాని బస్సు ఛార్జీలను నిర్ణయించామని ఆయన తెలిపారు. ఖమ్మం నుండి బెంగళూరు నడుపబడుతున్న గరుడ ప్లస్ సర్వీసులకు చార్జీల తగ్గింపు వర్తించదని, బెంగళూరు వెళ్ళు గరుడ ప్లస్ సర్వీసులకు చార్జీల్లో సవరణ లేదని,ఆ ఛార్జీలు యధాతథంగానే ఉంటాయని, కేవలం ఖమ్మం నుండి హైదరాబాద్, కూకట్ పల్లి వరకు వెళ్లే గరుడ ప్లస్ సర్వీసులకు మాత్రమే చార్జీల సవరణ జరిగిందని ఈ విషయాన్ని ప్రయాణికులు గమనములో ఉంచుకోవాలని డిపో మేనేజర్ గారు సూచించారు.బస్సు ఛార్జీల సవరణ ఫలితంగా ఖమ్మం నుండి హైదరాబాద్ కు రూ.450  ఉన్న గరుడ ప్లస్ ఛార్జీ రూ.80 తగ్గి రూ.370 అయ్యిందని,అదేవిధంగా ఖమ్మం నుండి కూకట్ పల్లి కు రూ.490 ఉన్న గరుడ ప్లస్ ఛార్జీ రూ.80 తగ్గి రూ.410 అయ్యిందని డిపో మేనేజర్ తెలిపారు.ప్రయాణికులు ఈ అవకాశం వినియోగించు కోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సంస్థ ఉన్నతాధికారుల సూచనల మేరకు మార్చి 31 వ,తేదీ వరకు ఈ అవకాశం అమలులో ఉంటుదని ఆయన పేర్కొన్నారు.