జనవరి 31 వరకు 30 పోలీస్ యాక్ట్ యధావిధిగా అమలు: పోలీసు కమిషనర్
(ఖమ్మం-విజయంన్యూస్);-
శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా జనవరి 31వ తేదీ వరకు ఖమ్మం కమిషనరేట్ పరిధిలో 30 పోలీస్ యాక్ట్ యధావిధిగా అమలులో వుంటుందని పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్. వారియర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఆంక్షలు అమలుల్లో వున్నందున అనుమతి లేకుండా ఎలాంటి సభలు, ర్యాలీలకు, సమావేశాలు నిర్వహించరాదని సూచించారు. గుంపులుగా తిరగటం నిషేధం వున్న నేపథ్యంలో వివిధ వర్గాల ప్రజలు, రాజకీయ పార్టీలు, వివిధ సంఘాల నాయకులు పోలీసులకు సహకరించాలని కోరారు . ఖమ్మం పోలీస్ కమీషనరేట్ పరిధిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా 30 పోలీసు యాక్ట్ అమలు చేస్తున్నట్లు పోలీస్ కమీషనర్ తెలిపారు.
also read :-కిష్టాపురంలో సీసీ కెమోరాలను పునరుద్ధరణ చేయించిన సీఐ సతీష్
** డీజేలకు అనుమతి లేదు
నివాస, వాణిజ్య ప్రాంతాలలో బహిరంగ ప్రదేశాలలో పగటి, రాత్రి సమయాలలో పరిమితులకు మించి శబ్దాన్ని ఉత్పత్తి చేస్తున్న డీజేలతో ఊరేగింపులు చేస్తూ పిల్లలు, వృద్ధులు, రోగులు, విద్యార్థులు, సాదారణ ప్రజలకు,తీవ్ర అసౌకర్యాన్ని కలిగిస్తున్న డీజేలకు అనుమతి లేదని తెలిపారు. ఈ ఉత్తర్వును ఉల్లంఘించిన వారిపై మెట్రోపాలిటన్ సిటీ పోలీస్ యాక్ట్, 2016 ఐపిసి 188 మరియు U/S 76 శిక్షకు బాధ్యత వహిస్తారని తెలిపారు.