ఖమ్మం, సెప్టెంబర్ 26(విజయంన్యూస్):
కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ, మహిళలకు స్పూర్తిగా నిలిచిన వీరనారి చాకలి ఐలమ్మ అని అన్నారు. పోరాటాల ఫలితమే మహిళా బిల్లు అని, చాకలి ఐలమ్మ పేరుతో ఒక పథకం ప్రవేశపెట్టమని ప్రభుత్వాన్ని కోరుతానన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్, రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, ఏఎంసి చైర్ పర్సన్ దోరేపల్లి శ్వేత, అదనపు డిసిపి కెఆర్ కె. ప్రసాద్ రావు, జిల్లా బిసి సంక్షేమ అధికారిణి జి. జ్యోతి, సమైక్య రజక సంఘం సీనియర్ నాయకులు రేగళ్ల కొండలు, ఖమ్మం జిల్లా బి.సి. సీనియర్ నాయకులు డాక్టర్ పాపారావు, పగడాల నాగరాజు, సమైక్య రజక సంఘం జిల్లా నాయకులు తాంగేళ్లపల్లి శ్రీనివాస్, పద్మశాలి సంఘం రాష్ట్ర నాయకులు బొమ్మ రాజేశ్వరరావు, బిసి ఫ్రoట్ జిల్లా అధ్యక్షురాలు జ్యోతి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ లింగబోయిన పుల్లారావు, సమైక్య రజక సంఘం తెనాలి వీరబాబు, మన రజక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బొడ్డు ఉపేందర్, రజక సంఘం నాయకులు కణతల నరసింహారావు, బీసీ నాయకులు, కుల సంఘ నాయకులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.