ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆధునిక సదుపాయాల కల్పన చేస్తున్నాం: మంత్రి
ప్రభుత్వాసుపత్రిలో ఫాకో మిషన్ ను ప్రారంభించిన మంత్రి
ఖమ్మం, జూన్ 28(విజయంన్యూస్):
అనంతరం వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారితో జరిగిన వీడియో కాన్ఫరెన్స్ లో మంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ, ఆధునిక టెక్నాలజీ తో శుక్లాల ఆపరేషన్ సౌకర్యం పేద ప్రజలకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఆధునిక యంత్రాల ద్వారా ప్రభుత్వ ఆసుపత్రులు బలోపేతం అయ్యాయని ఆయన అన్నారు. ఈ యంత్రం ద్వారా ఆపరేషన్లు చేయించుకున్నవారు త్వరగా కోలుకుంటారన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాల ఏర్పాటు పనులు పూర్తయినట్లు, ఫర్నీచర్, కావాల్సిన యంత్రాల కొరకు వేచియున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. వెంకటేశ్వర్లు, వైద్యాధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.