ప్రతిష్టాత్మకంగా మన ఊరు మన బడితో పాఠాశాలల అభివృద్ధి తథ్యం: మంత్రి ఎర్రబెల్లి
సకల సదుపాయాలతో, సర్వాంగ సుందరంగా సర్కార్ బడులు
ప్రతిష్టాత్మకంగా మన ఊరు మన బడితో పాఠాశాలల అభివృద్ధి తథ్యం: మంత్రి ఎర్రబెల్లి
సకల సదుపాయాలతో, సర్వాంగ సుందరంగా సర్కార్ బడులు
విడతల వారీగా ఎంపిక చేసిన స్కూల్స్ అభివృద్ధి
తాము చదివిన బడుల బాగు కోసం పూర్వ, ఎన్ ఆర్ ఐ విద్యార్థులకు ఇది మంచి అవకాశం
ప్రతి పౌరుడు ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలి
విరాళం ప్రకటించిన నైట్ వాచ్ మన్ బిక్షపతి కి ఘనంగా సన్మానం
– రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రెడ్డి గారు
(జనగామ జిల్లా పాలకుర్తి విజయం న్యూస్);-
గతంలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ పాఠశాలలు, వైద్య శాలల ను బాగు చేసే పనిని సీఎం కెసిఅర్ నేతృత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది. ఈ మహా యజ్ఞంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి. ప్రభుత్వ పథకాన్ని విజయవంతం చేయాలి. అని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో సీజిఐ సౌజన్యంతో బాల వికాస ప్రతినిధులు శౌరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కోవిడ్ కిట్లు, హాండ్ వాష్, యూనిట్లను నియోజకవర్గంలోని ఐదు మండలాల ఉన్నత పాఠశాలలకు పంపిణీ చేసిన రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అనంతరం మాట్లాడారు.
allso read;-సీఏల్పీ నేత భట్టి విక్రమార్క చిట్ చాట్.. .
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 7 వేల 289 కోట్ల రూపాయల వ్యయంతో మన ఊరు మనబడి కార్యక్రమం అమలు చేస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగా ఈ సంవత్సరం 3 వేల 497 కోట్ల రూపాయల వ్యయంతో రాష్ట్రంలోని 9 వేల 123 ప్రభుత్వ పాఠశాలను బాగు చేస్తున్నామన్నారు. పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో ఈ సంవత్సరంలో మొత్తం 104 ప్రభుత్వ, మండల పరిషత్, జిల్లా ప్రజా పరిషత్ పాఠశాలలో మన ఊరు మనబడి కార్యక్రమం అమలు చేస్తున్నామని చెప్పారు. నియోజకవర్గంలోని పాలకుర్తి మండలంలోని 24 పాఠశాలలో, కొడకండ్ల మండలంలోని 11 పాఠశాలల్లో, పెద్దవంగర మండలంలోని 12 పాఠశాలల్లో, దేవరుప్పుల మండలంలోని 18 పాఠశాలలో, రాయపర్తి మండలంలోని 21 పాఠశాలలో, తొర్రూరు మండలంలోని 18 పాఠశాలలో మన ఊరు మన బడి కార్యక్రమాన్ని అమలు చేయడానికి విద్యాశాఖ అధికారులు ఎంపిక చేశారని వివరించారు.
also read;-బాధిత కుటుంబాన్నీ ఓదార్చిన కేటీఆర్
ఆయా పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనలో పాటుగా నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించాలనే సంకల్పంతో మన ఊరు మన బడి కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. పాఠశాలలో డిజిటల్ విద్య అమలు, విద్యుదీకరణ, త్రాగునీటి సరఫరా, సరిపడా ఫర్నీచరు, అవసరమైన మరమ్మతులు, పాఠశాలకు రంగులు వేయడం, గ్రీన్ చాక్ బోర్డ్ ల ఏర్పాటు, ప్రహరీ గోడ నిర్మాణం. కిచెన్ షెడ్ల నిర్మాణం, అదనపు తరగతి గదుల నిర్మాణం, ఉన్నత పాఠశాలలో డైనింగ్ హాల్ ల నిర్మాణం, నీటి సౌకర్యాలతో కూడిన మరుగుదొడ్ల నిర్మాణం వంటి సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంపై ప్రజల్లో ఇప్పటికే అవగాహన కల్పించామన్నారు.
also read;-కరీంనగర్ లో మంత్రి కేటి ఆర్ కు ఘన స్వాగతం
అయితే మంత్రులు కేటీఆర్, హరీష్ రావు లు తమ నియోజకవర్గాల్లో పాఠశాలల ను అద్భుతంగా తీర్చిదిద్దారు. అంతకన్నా మంచిగా మన నియోజకవర్గ పాఠశాలలు ఉండాలన్నారు. పాలకుర్తి పాఠశాలకు ఒక బస్సు కూడా ఉండాలని అందరి చప్పట్ల మధ్య చెప్పారు.నైట్ వాచ్మెన్ బిక్షపతి తన వంతు విరాళంగా 10 వేలు ప్రకటించారు. NRI మెతుకు ఉపేందర్ 10 వేలు ప్రకటించారు. కాగా మంత్రి బిక్షపతి ని ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమం నిర్వహించిన సి జీ ఐ కి చెందిన నిర్భయ, బల వికాస బాల శౌరి లను అభినందించిన మంత్రి, వారిని సన్మానించారు
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శివలింగయ్య, పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల మండలాల ఎంపీపీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ లు సర్పంచ్ లు, ప్రధానోపాధ్యాయులు, ఎస్ ఎమ్ సి చైర్మన్లు, ప్రజా ప్రతినిధులు, టిఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.