Telugu News

అశ్రునయనాలతో శ్రీనివాసరావుకు అంతిమ వీడ్కోలు..

▪️ఎఫ్ఆర్వో శ్రీనివాస రావు భౌతికకాయానికి నివాళుల‌ర్పించిన మంత్రులు పువ్వాడ, ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి.

0

అశ్రునయనాలతో శ్రీనివాసరావుకు అంతిమ వీడ్కోలు..

== ఎఫ్ఆర్వో శ్రీనివాస రావు భౌతికకాయానికి నివాళుల‌ర్పించిన మంత్రులు పువ్వాడ, ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి.

== అంతిమ యాత్రలో పాల్గొన్న మంత్రులు. ఘన నివాళులు అర్పించిన ప్రజలు

(ఖమ్మం-విజయంన్యూస్)

ఫారెస్ట్ రెంజ్ ఆఫీసర్ శ్రీనివాస్ రావు అంతిమయాత్ర కన్నీటిపర్వంతం నడుమ సాగింది.  ఖమ్మం నియోజకవర్గం రఘునాధపాలెం మండలం ఈర్లపుడి గ్రామంలో శ్రీనివాస రావు భౌతిక‌కాయానికి మంత్రులు పువ్వాడ అజయ్ కుమార్ , ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి  పుష్పంజ‌లి ఘ‌టించి, నివాళుల‌ర్పించారు. FRO శ్రీనివాస రావు కుటుంబ స‌భ్యుల‌ను ఓదార్చారు. ప్రభుత్వం అన్ని విధాలుగా అండ‌గా ఉంటుంద‌ని భరోసా ఇచ్చారు. అనంతరం శ్రీనివాస రావు అంతిమ యాత్రలో పాల్గొని, ప్రభుత్వం తరుపున మంత్రులు పాడే మోశారు. అనంతరం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి..

ఇది కూడా చదవండి: ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ దారుణహత్య