మీ సేవలు అభినందనీయం.: మంత్రి పువ్వాడ.
◆ టీకాల్లో వంద శాతం పూర్తి చేసిన ఖమ్మం జిల్లా.
◆ అందుకు కృషి చేసిన జిల్లా యంత్రాంగం, సిబ్బందిని అభినందించిన మంత్రి.
◆ కేక్ కట్ చేసి.. శాలువతో సత్కరణ.జ్
◆ పెద్ద రాష్ట్రాల్లో తెలంగాణ టాప్.
౼ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ..
(ఖమ్మం-విజయం న్యూస్)
యావత్ దేశాన్నే వణికిస్తున్న కరోనా మహమ్మారి నివారణ చర్యలకై అందిస్తున్న కోవిడ్ వాక్సినేషన్ మొదటి డోస్ ఖమ్మం జిల్లాలో 100% పూర్తి చేసిన జిల్లా యంత్రాంగానికి రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అభినందించారు.
జిల్లాలో 100% వాక్సినేషన్ మొదటి డోస్ పూర్తి స్థాయిలో అందించిన సందర్భంగా జడ్పీ హాల్ నందు నిర్వహించిన అభినందన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు..
మొదటి డోస్ వ్యాక్సినేషన్ ను విజయవంతంగా పూర్తి చేయడానికి గ్రామ స్థాయి నుంచి నగరాల వరకు పని చేసిన సంబంధిత శాఖల అధికారులకు, సిబ్బంది అంకిత భావంతో పని చేశారని.. వారి సహకారంతోనే వ్యాక్సినేషన్ కార్యక్రమం ఎలాంటి ఇబ్బందులు లేకుండా విజయవంతంగా పూర్తి చేశారని అందుకు వారికి అభినందనలు తెలియజేశారు.
కరోనా తీవ్రంగా ఉన్న సమయంలో జిల్లా యంత్రంగం, సిబ్బంది సహసోపేతంగా పనిచేశారని గుర్తు చేశారు.
రెండో డోసు వేయించుకోవాల్సిన వారు నిర్ణీత సమయానికల్లా వేయించుకోవాలని సూచించారు. ఒమిక్రాన్ వ్యాపిస్తున్న వేళ రెండో డోసుని అందరూ తప్పకుండా వేయించుకోవాలని, బూస్టర్ డోస్ కూడా త్వరలో అందుబాటులోకి రానుందన్నారు.
ప్రజలకు కరోనా టీకాలు వేయటంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచిందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ కుమార్ అన్నారు.
సోషల్ డిస్టెన్స్ తో పాటు ప్రతి ఒక్కరు మస్కులు తప్పక ధరించాలని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా సూపర్ స్ప్రేడర్స్ కు వాక్సిన్ ఇచ్చే కార్యక్రమంలో కూడా ఖమ్మం జిల్లానే ముందంజలో నిలిచిందన్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని రంగాల కార్మికులకు విడతల వారిగా పూర్తి స్థాయిలో వాక్సిన్ ను అందించమన్నారు.
కోవిడ్ ఉదృతంగా ఉన్న సమయంలో రోగులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మెడిసిన్, ఆక్సిజన్, బెడ్స్, ర్యాపిడ్ టెస్ట్స్ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో రేమిడేసివేర్ ఇంజెక్షన్స్ ను సమకూర్చి జిల్లా ప్రజలకు అందుబాటులో ఉంచడం జరిగిందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రెడ్ జోన్, కంటైన్మెంట్ జోన్ లోకి వెళ్లి కోవిడ్ బాధితులకు ధైర్యం చెప్పి, వారికి నిత్యావసర సరుకులు అందించి వారికి ధైర్యం కల్పించామన్నారు.
రెండు సార్లు కోవిడ్ బారిన పడినప్పటికి మనో ధైర్యంతో ఎదుర్కొని మళ్ళీ ప్రజలకు సేవచేయగలిగామని వివరించారు.
తమ ప్రాణాలను పణంగా పెట్టి ఖమ్మం జిల్లా ప్రజలకు తమ సేవలను అందించిన వైద్యాధికారులు, సిబ్బంది, పంచాయతీ, అంగన్వాడీ, మున్సిపల్ తదితర శాఖ సిబ్బందిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ప్రత్యేక చొరవతో రాష్ట్రంలో అతి తక్కువ నష్టంతో ఈ మహమ్మారిని ఎదుర్కోగలలిగామన్నారు.
పెద్ద రాష్ట్రాల్లో అత్యధిక శాతం మందికి టీకాలు వేసిన రాష్ట్రం తెలంగాణనే అన్నారు.
సహజంగా టీకాలు వేసుకోవడానికి ప్రజలే ఆస్పత్రులకు వస్తారు.. కానీ మన రాష్ట్రంలో ప్రజల వద్దకే టీకాలు తీసుకెళ్లి అందించగల్లిగామన్నారు.
ఇంటింటికీ తిరగటంతోపాటు, పని ప్రదేశాల్లో ప్రత్యేక క్యాంపులు పెట్టి ప్రజలను ఒప్పించి టీకాలు వేస్తున్నమన్నారు..
టీకాలు వేసుకొనేందుకు ఆసక్తి చూపని వారు, గడువు ముగిసినా రెండో డోస్ వేసుకోని వారిని గుర్తించి టీకాలు వేయనున్నామన్నారు.
రాష్ట్రంలో శుక్రవారం నాటికి మొదటి డోస్ 99.35 శాతానికిపైగా వేయగా, 63.40 శాతం మందికి రెండో డోస్ లు అందించడం పట్ల మంత్రి పువ్వాడ హర్షం వ్యక్తం చేశారు.
100% వాక్సిన్ పూర్తి చేసిన సందర్భంగా కేక్ కట్ చేశారు. అనంతరం ఉత్తమ పలువురు సిబ్బందిని శాలువతో సత్కరించారు.
కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ గారు, మేయర్ పునుకొల్లు నీరజ , సూడా చైర్మన్ విజయ్ జిల్లా కలెక్టర్ VP గౌతమ్ , మున్సిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి , అదనపు కలెక్టర్ మధుసూదన్ , DM&HO మాలతి గారు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది ఉన్నారు..
also read :-కళామందిర్ షోరూం ను ప్రారంభించిన మంత్రి పువ్వాడ..