Telugu News

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచనల వ్యాఖ్యలు..

ఆ పని చేయడం ఖాయమంటున్న పొంగులేటి

0

పొంగులేటి సంచలన వ్యాఖ్యలు

== ఆ పని చేయడం ఖాయమంటున్న పొంగులేటి 

== సమయం… సందర్భం వచ్చినప్పుడు అన్ని విషయాలు వెల్లడిస్తా
== ప్రజాహితమే నా అభిమతం…. తప్పకుండా వారి కోరిక నేరవేరుస్తానని హామీ ఇస్తున్నా

== కార్యకర్తలు ఓపిక పట్టండి.. రాబోయేది మన రాజ్యమే
== న్యూఇయర్ వేడుకల్లో మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి
== పొంగులేటి క్యాంపు కార్యాలయంలో అంబరాన్నంటిన న్యూ ఇయర్ సంబురం
== ఉమ్మడి ఖమ్మంజిల్లా నుంచి వేలాదిగా తరలొచ్చిన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శీనన్న మిత్రులు
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి  సంచలన వ్యాఖ్యలు చేశారు.. నూతన సంవత్సరం సందర్భంగా ఖమ్మంలోని ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మెళనం కార్యక్రమం సందర్భంగా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేయడంతో ఇప్పుడు హాట్ టాఫిక్ గా మారిపోయింది.. నేను.. నాతో పాటు నా వర్గీయులందరిది ఒకే మాట.. ఒకే బాట.. ఆ పనిచేస్తామని కచ్చితంగా తెల్చి చెప్పారు. దీంతో పొంగులేటి వర్గీయుల్లో సంతోషం నెలకొన్నప్పటికి బీఆర్ఎస్ పార్టీలో కలవరం మొదలైందనే చెప్పాలి. అసలు ఖమ్మం బీఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుందో అర్థం కానీ పరిస్థితి నేలకొందని అంటున్నారు.

ఇది కూడా చదవండి: బీఆర్ఎస్ లో విందు రాజకీయం..

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నేను పోటీ చేస్తున్నా..? నాతో పాటు నా టీమ్ సభ్యులు కూడా పోటీ చేస్తున్నారు.. ఎవరు ఇందులో కన్ఫ్యూజన్ అవ్వాల్సిన పనిలేదు.. కార్యకర్తలు కొంత ఓపిక పట్టండి.. రాబోయేది మన రాజ్యమేనంటూ మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు.  ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తానని… ప్రజాహితమే నా అభిమతంగా భావించే నేను… తప్పకుండా వారి కోరిక నేరవేరుస్తానని ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. ఖమ్మంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఆదివారం జరిగిన నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఈయన ప్రసంగించారు. ఆయనేం మాట్లాడారో

ఆయన మాట్లలోనే..
నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేసేందుకు విచ్చేసిన ప్రతి ఒక్క అక్కకు, చెల్లికి, అన్నకు, తమ్ముడికి శిరస్సు వంచి పేరుపేరునా అభినందనలు చెబుతున్నా, కృతజ్ఞతలు. మీ అందరికీ 2023 నూతన సంవత్సర శు భాకాంక్షలు… ఈ సంవత్సరంలో మీకు… నాకు… వేదిక మీద… వేదిక ముందున్న ప్రతి ఒక్కరికీ మంచి జరగాలని… మంచి జరుగుతుందని ప్రగాఢంగా నమ్ముతూ భారాన్ని దేవుడి మీదతో పాటుగా మీ మీద కూడా ఉంచి ఈ రోజు మనమందరం ఇక్కడ సమావేశం అవ్వడం జరిగింది. వేదిక మీద ఉన్న కొంతమంది నా మిత్రులు… ఇంకా రాని కొంతమంది నా మిత్రులతో పాటు…

ఇది కూడా చదవండి: ఇది ఎలక్షన్ ఇయర్.. ఇక ప్రచారం షూరు

ప్రజల చేత దీవించబడే ప్రజాప్రతినిధి అర్హత ఉన్నా ప్రతి ఒక్క నా అనుచరుడు… రాబోవు ఎన్నికల్లో పోటీచేస్తారని ఈ వేదిక సాక్షిగా తెలియజేస్తున్నాను. గడిచిన నాలుగున్నరేళ్లలో ఏమి ఇబ్బంది జరిగింది… ఎందుకు జరిగిందనేది మనకు తెలియంది కాదు… ఈనాడు మనం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం… ఈ పార్టీలో మనకు జరిగిన గౌరవం ఏంటి…? భవిష్యత్తులో జరగబోవు గౌరవం ఏంటి…? అనేది ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఒక్కటైతే ఖచ్చితంగా చెబుతున్నాను… ఈ వేదిక మీద ఉన్న వివిధ నియోజకవర్గాల ముఖ్య నాయకులందరూ కూడా రాబోవు అసెంబ్లీ ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీచేసి తీరుతారు. ప్రజల ప్రేమ, అభిమానాలు పొందిన… పొందుతూ ఉన్న ప్రతీ నాయకుడు ప్రజాప్రతినిధి కావాల్సిన ఆవశ్యకత ఉంది. అలా అయినప్పుడే ప్రజలకు మంచి జరుగుతుంది… న్యాయం జరుగుతుంది… ప్రజాహిత పరిపాలన జరుగుతుంది… ఇది రాజకీయ వేదిక కాదు… సమయం… సందర్భం వచ్చినప్పుడు అన్ని విషయాలు మీతో చర్చిస్తా…! తప్పకుండా మీ దీవెనలతో… మీ ఆశీర్వాదంతో… మీరు ఏదైతే కోరుకుంటున్నారో… కోరుకునేది తప్పకుండా చేసి చూపిస్తామని హామీ ఇస్తున్నాను. మరొకసారి ఈ కార్యక్రమానికి హాజరైన శీనన్న కుటుంబసభ్యులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నానంటూ ప్రసంగాన్ని ముగించారు.
ఇది కూడా చదవండి: ఆ పని చేయడమే నా లక్ష్యమని అంటున్న తుమ్మల
-అంబరాన్నంటిన సంబురం…
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పొంగులేటి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సంబురాలు అంబరాన్నంటాయి. ఉమ్మడి ఖమ్మంజిల్లాల నుంచి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శీనన్న మిత్రులతో పాటు ఆయా ప్రాంతాల స్థానిక ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, పలు సంఘాల నేతలు, వ్యాపార, వాణిజ్య ప్రముఖులు, ఇంకా అనేక మంది వేలాదిగా తరలొచ్చారు. శీనన్నకు పుష్పగుచ్ఛాలు, శాలువాలు, బోకేలు, ప్రత్యేకమైన కానుకలను అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేయడంతో పాటు ఆయనపై వారికున్న అభిమానాన్ని చాటుకున్నారు. ఆయా ప్రాంతాల నుంచి లారీలు, ట్రాక్టర్లు, బస్సులు, కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాల్లో ర్యాలీగా తండోపతండాలుగా వేడుకకు హాజరైయ్యారు. ర్యాలీల సందర్భంగా డప్పు చప్పుళ్లు, ప్రత్యేకమైన వేషదారణలు, కోలాట నృత్యాలు వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వేడుకకు విచ్చేసిన ప్రతిఒక్కరికీ శీనన్న అతిథ్యాన్ని అందజేశారు. న్యూఇయర్ కేకుతో పాటు పసందైన వంటకాలను విచ్చేసిన ప్రజానీకానికి రుచిచూపించారు. శీనన్న అతిథ్యం బేష్ అంటూ వేడుకకు విచ్చేసిన ప్రతిఒక్కరూ ఆనందం వ్యక్తం చేశారు.

== హాజరైన ముఖ్యనేతలు

పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన నూతన సంవత్సర వేడుక కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, నాయకులు మట్టా దయానంద్,  బేబి మద్దినేని స్వర్ణకుమారి, మాజీ డీసీసీబీ చైర్మన్ మువ్వా విజయ్ బాబు, రామసహాయం నరేష్ రెడ్డి, జడ్పీచైర్మన్ కోరం కనకయ్య, మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మినారాయణ, అధినారాయణ, నిరంజన్ రెడ్డి, బోర్రా రాజశేఖర్ తదితరులు హాజరైయ్యారు.