16 క్విటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత
(కరీంనగర్ విజయం న్యూస్):-
కరీంనగర్ టాస్క్ఫోర్స్ పోలీసులు బుధవారం నాడు చొప్పదండి లోని రెండు రైస్ డిపో లపై దాడులు నిర్వహించి అక్రమంగా నిల్వ ఉంచిన పిడిఎస్ బియ్యాన్ని పట్టుకున్నారు. అక్రమంగా నిల్వ ఉంచిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.
also read:-జగన్ సర్కారుకు షాక్..
పిడిఎస్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచారనే పక్కా సమాచారం అందుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు బుధవారం దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా అదే గ్రామానికి చెందిన రైస్ డిపో నిర్వాహకులు మహేశుని రామచంద్రం, ఎలిగేటి నాగరాజు లను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్లో అప్పగించారు